Minister Ponguleti: రౌడీయిజం సరికాదు.. కట్టడి చేయండి
- సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు బాధాకరం..
- స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేపర్లు విసిరేసిన తీరు దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ponguleti: సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు బాధాకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దళితెడూర స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తించడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. రౌడీయిజం చేయడం సరికాదన్నారు. దీన్ని కట్టడి చేయాలన్నారు. ఒక ఎమ్మెల్యే కేసు గురించి ఇలా చేయడం సరికాదన్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు విసిరేయడం కరెక్ట్ కాదన్నారు. ఇది స్పీకర్ కు అవమానించడమే అన్నారు. సభ అనంతరం చాంబర్కు పిలుస్తానని స్పీకర్ చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలా ప్రవర్తించడం బాధాకరం అన్నారు.
Read also: Harish Rao Vs Speaker: ఒక సభ్యుని కోసం సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదు
Also Read
- CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
మరోవైపు మంత్రులు అసెంబ్లీలో లేరని మాజీ మంత్రి హరీశ్ రావు అనడం అన్యాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాను సభలో ఉన్నానని.. నేను మంత్రినేనని గమనించాలని అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2020 ఆర్ఓఆర్ చట్టం వల్ల లక్షలాది మంది రైతులు నష్టపోయారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నష్టపోయిన రైతులందరికీ భరోసా కల్పించేందుకు కొత్త చట్టం తెస్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్య మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆర్ఓఆర్ 2024 చట్టంపై సభలో మాట్లాడారు.
Read also: KTR: కేసు విషయంలో నేనేం భయపడడం లేదు..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి లాంటి చట్టం గత రాచరికంలోనూ ఉండేదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే అమాయకులు శిక్ష అనుభవిస్తారని అన్నారు. సిద్దిపేట జిల్లాలో ధరణి తప్పుడు రికార్డుతో మద్దెల కిష్టయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. గత హయాంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బీసీలకు చెందిన వేలాది ఎకరాల భూములను ధర్నాలు తీసుకొచ్చి లాక్కెళ్లారని ఆరోపించారు. తాము తీసుకువస్తున్న భూభారతి నిజమైన ప్రజల చట్టమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
Maheshwar Reddy: కేసీఆర్ పేదల భూములు లాక్కున్నారన్న కాంగ్రెస్.. లాభ పడింది ఎవరో చెప్పడం లేదు..
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?