Kishan Reddy: ఈనెల 21 నుండి 24 వరకు.. శిల్పకళా వేదికగా లోక్ మంథన్ కార్యక్రమం..
- ఈ నెల 21 నుండి 24 వరకు శిల్పారామం లో లోకమంథన్ కార్యక్రమం..
- పాల్గొననున్న 12 దేశాల ప్రతినిధులు, 350 రకాల ప్రదర్శనలు, 1500 మంది కళాకారులు..
- లోక్ మంథన్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరుగుతుంది..
- ఈ సారి శిల్పకళా వేదికగా హైదరబాద్ లో జరుగుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ఈనెల 21 నుండి 24 వరకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా లోక్ మంథన్ కార్యక్రమం జరుగునున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ , పూజనీయ RSS సరసంఘ్ చాలక్ మోహన్ భాగవత్ , గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. అంతేకాకుండా.. 12 దేశాల ప్రతినిధులు, 100 మంది వక్తలు, 350 రకాల ప్రదర్శనలు, 1500 మంది కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. లోక్ మంథన్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సారి శిల్పకళా వేదికగా హైదరబాద్ లో జరుగుతుందని తెలిపారు. ఈనెల 21 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించ నున్నట్లు తెలిపారు.
Read also: Ayyappa Devotees: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 17 నుంచి ఎస్సీఆర్ 26 ప్రత్యేక రైళ్లు..
Also Read
- CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
- Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
- Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
- CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
భారతీయ సంస్కృతి ఏకత్వాన్ని చాటే కార్యక్రమం అన్నారు. ఇతర దేశాల నుండి కూడా ప్రతినిధులు పాల్గొన బోతున్నట్లు వెల్లడించారు. వందలాది కళాకారులు, విద్యా వేత్తలు, మేధావులు పాల్గొంటారన్నారు. సముద్ర మథనం ఎలా జరిగిందో అలా ఈ లోక్ మంథన్ జరుగుతుందని తెలిపారు. వనవాసి, నగర వాసి, గ్రామ వాసి ఈ మూడు కలిస్తే నే దేశం అన్నారు. దురదృష్టవశాత్తూ కులాల వారీగా విభజించే కుట్ర జరుగుతుందన్నారు. భీర్సా ముండా జయంతి నీ గిరిజన గౌరవ దినం గా కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తుందని గుర్తు చేశారు. 21 న స్టాల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం వెంకయ్య నాయుడు చేస్తారని తెలిపారు. 22 వ తేదీ న ఈ లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారన్నారు. ప్రజలు అందరూ , అన్ని వర్గాల వాళ్ళను ఈ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Gold Rate Today: పసిడి తగ్గుదలకు బ్రేక్.. పెరిగిన బంగారం ధరలు!
తాజావార్తలు
-
S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
-
S Janaki: “ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు..” ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
-
S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
-
Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్లో కింగ్ రైటింగ్!
-
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!