KTR: ఆశా వర్కర్లపై దాడి చేసిన పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించాలి.. కేటీఆర్ డిమాండ్
- ఆశా వర్కర్లపై నిన్న ఎవరైతే దాడి చేసిన పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించాలి..
- ఆశా వర్కర్లకు రూ.18వేలు జీతం చేస్తామని మాట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం..
- ఇదేనా హోం శాఖ తీరు అని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించిన కేటీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: ఆశా వర్కర్లపై నిన్న ఎవరైతే దాడి చేసిన పోలీసులు ఉన్నారో వారిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న కేటీఆర్ నిన్న ఆశ వర్కర్ల ఆందోళనలో గాయపడ్డ వారిని పరామర్శించారు. కేటీఆర్ తో పాటు ఎంఎల్ఏ లు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. నిన్న డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ జన్మదినం అని చెప్పి.. కాంగ్రెస్ పార్టీ పాలన ఏడాది పూర్తి చేసుకుందని అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన ఆశాలు ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు. నిన్న ఆడబిడ్డలపై దమనకాండ అందరూ ఖండించారని కేటీఆర్ తెలిపారు.
Read also: MLA Beerla Ilaiah: ఆర్టీసీ బస్సులో డాన్స్ చేయమన్న కేటీఆర్.. మహిళల గురించి మాటలా..
Also Read
మగ పోలీసులు ఆడవాళ్ళని దుశ్శాసన పర్వం చూసామన్నారు. ఇదేనా హోం శాఖ తీరు అని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చాక ఆశా వర్కర్లకు రూ.18వేల రూపాయలు చేస్తామని మాట ఇచ్చింది. మీరు ఇచ్చిన మాటనే కదా అన్నారు. మీ దగ్గరికి వచ్చి శాంతియుతంగా ధర్నా చేస్తుంటే.. మీరు చేపట్టిన దమనకాండ రాష్ట్రమంతా చూసిందన్నారు. రహీమ్ బీ.. సంతోష అనే ఆశావర్కర్లపై ఇష్టం వచ్చినట్టు భౌతికంగా దాడి చేశారన్నారు. పోలీసులు ఇంత నీఛంగా ప్రవర్తించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. మేము మానవ హక్కుల కోసం పొరాడుతామన్నారు. మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్ నీ కలుస్తామన్నారు.
ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో వున్న వారికి వైద్యం సరిగ్గా అందకపోతే మేము ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తామని తెలిపారు. ఆశావర్కర్లకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. నిన్న ఎవరైతే దాడి చేసిన పోలీసులు ఉన్నారో వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది మంచి వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. గతంలో వారికి రూ.1700 జీతం ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.9.750 రూపాయలకు పెంచామన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ రూ.18 వేలకు పెంచుతాం అని, మరి దాన్ని నెరవేర్చాలని వారు అడిగారని కేటీఆర్ స్పష్టం చేశారు.
Yennam Srinivas Reddy: అయ్యా కేటీఆర్.. విగ్రహాన్ని టచ్ చేసే అవకాశం ఇవ్వరు.. ఎమ్మెల్యే ఫైర్
తాజావార్తలు
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!