Yennam Srinivas Reddy: అయ్యా కేటీఆర్.. విగ్రహాన్ని టచ్ చేసే అవకాశం ఇవ్వరు.. ఎమ్మెల్యే ఫైర్
- మీరు మళ్ళీ అధికారంలోకి వస్తా అనటం మీ అవివేకం..
- ఎవ్వరు విగ్రహం టచ్ చేయాలనీ చూసిన మాడి మసై పోతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yennam Srinivas Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని టచ్ చేసే అవకాశం కూడా తెలంగాణ ప్రజలు కేటీఆర్ కు ఇవ్వరని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేటీఆర్ మళ్ళీ అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెచ్చి గాంధీ భవన్ లో పెడుతారట, అంటూ మండిపడ్డారు. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తా అనటం మీ అవివేకం అన్నారు. తెలంగాణా తల్లి విగ్రహం చట్ట సభలో ఆమోదించాకే ఆవిష్కరణ జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఎవ్వరు విగ్రహం టచ్ చేయాలనీ చూసిన మాడి మసై పోతారు జాగ్రత్త అని హెచ్చరించారు.
Read also: RGV Case : రామ్గోపాల్వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
కవులను, కళాకారులను గుర్తించాలని ప్రభుత్వం భావించి, వాళ్లకు సన్మానం చేస్తే కూడా ఎమ్మెల్సీ కవిత తప్పు పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారానికి అడ్డు వస్తారని ఐదేండ్లు మహిళా మంత్రిని కూడా చేయని మీరు.. మహిళల గురించి మాట్లాడుతున్నారా…? అని ప్రశ్నించారు. కేటీఆర్, కవితకు సూటి ప్రశ్న.. మీరు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ భవన్లో రూపొంద లేదా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కు తరలిస్తామంటున్నారని అన్నారు. పది ఏండ్లు అధికారంలో ఉండి ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు? అని మండిపడ్డారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
కేటీఆర్, కవిత లు అమెరికా నుండి వచ్చినప్పుడు ఆస్తి ఎంత? ఇప్పుడు మీ ఆస్తి ఎంతో చెప్పాలని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం చాకలి ఐలమ్మ ప్రతి రూపమేనని సంబండ వర్గాలు అభిప్రాయ పడుతున్నారని అన్నారు. గద్దర్, గూడ అంజన్న, విమలక్క, అశోక్ తేజ, జయరాజ్, లను మీరు ఎందుకు గుర్తించలేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరేటి వెంకన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినా సరే కవిగా ఆయనను సన్మానించామని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమ కారులకు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు.
Lagacharla Case: నరేందర్రెడ్డి, సురేష్ సహకరించట్లేదు.. కస్టడీని మరో రెండు రోజులు పొడిగించండి..
తాజావార్తలు
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..