R. Krishnaiah: నేను ఏ పార్టీలోకి వెళ్లలేదు.. నన్నే పిలిచి సీటిచ్చారు.. ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య నామినేషన్..
- ఏ పార్టీలో ఉన్నా.. తాను బీసీల సంక్షేమం కోసం పని చేస్తా..
- నేను ఏ పార్టీలోకి వెళ్లలేదు.. నన్నే పిలిచి సీటిచ్చారన్న కృష్ణయ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R. Krishnaiah: ఆ మధ్యే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య.. మరోసారి పెద్దల సభలు అడుగుపెట్టబోతున్నారు.. దీని కోసం.. రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆర్.కృష్ణయ్య.. అయితే, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏ పార్టీలో ఉన్నా.. తాను బీసీల సంక్షేమం కోసం పని చేస్తాను అని స్పష్టం చేశారు.. అయితే, నేను ఏ పార్టీలోకి వెళ్లలేదు.. నన్నే పిలిచి సీటిచ్చారని పేర్కొన్నారు.. నేను ఏపార్టీలో ఉన్నా బీసీల కోసమే పని చేస్తా అంటున్నారాయన.. అయితే కేంద్రంలో ఉన్న అధినాయకత్వం బీసీలే.. ఇక్కడ నేను బీజేపీ బలోపేతానికి పని చేస్తా అంటున్నారు..
Read Also: Vizag Honey Trap Case: జాయ్ జెమిమా హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్..
Also Read
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
ఇక, బీజేపీయే నన్ను ఆహ్వానించి రాజ్యసభ సీటు ఇచ్చిందని తెలిపారు ఆర్.కృష్ణయ్య.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.. ఎప్పుడైనా పార్టీలే నా దగ్గరకి వచ్చాయి.. కానీ, నేను పార్టీ మారలేదన్నారు.. 2014లో తెలంగాణ సీఎం చేస్తా అంటూ చంద్రబాబు పిలిచారు.. ఆ తరువాత వైసీపీ పిలిచి రాజ్యసభ ఇచ్చింది.. కానీ, మాట్లాడాలని చూసినా అవకాశం రాలేదు నాకు వైసీపీలో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. బీసీలకు అవకాశల కోసం పోరాడాను.. అధికారం నాకు అవసరం లేదు.. రాజీనామా చేసిన తరువాతే నన్ను బీజేపీ పిలిచిందని స్పష్టం చేశారు.. బీసీలకు లాభం జరుగుతుందంటే ఎక్కడికైనా వెళ్తాను అన్నారు.. బీసీల కోసమే పోరాడతాను.. అవకాశం ఉన్నపుడు పార్టీ కోసం పని చేస్తాను అన్నారు ఆర్.కృష్ణయ్య.. కాగా, ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజీపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యతో పాటు.. టీడీపీ అభ్యర్థులు బీదా మస్తాన్ రావు, సానా సతీష్ కూడా నామినేషన్లు వేశారు..
తాజావార్తలు
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!