Jagga Reddy: విమర్శలకు సమయం కాదు.. కలిసి ప్రజల్ని ఆదుకుందాం
- రాజకీయాలు చేసే సమయమా..?..
- ముగ్గురు మంత్రులు ఏం చేస్తలేరు అంటున్నావు-ఏం చేయాలో చెప్పడం లేదు..
- ప్రతిపక్ష పార్టీ ఎలా ఉండాలో మమ్మల్ని అడిగేతే మేమే ట్రైనింగ్ ఇస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: విమర్శలకు సమయం కాదు..ప్రభుత్వం..ప్రతిపక్షం కలిసి ప్రజల్ని ఆదుకుందామని పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంత్రులంతా వరద బాధితుల సేవలోనే ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఫిల్డ్ లో ఉందని తెలిపారు. బాధ్యతగా సిన్సియర్ గా పని చేస్తున్నారని అన్నారు. సీఎంతో మోడీ మాట్లాడటం.. 7 వేల కోట్లు నష్టం జరిగినట్టు కేంద్రానికి నివేదికలు పంపారు సీఎం అన్నారు. వర్షాలు వస్తున్నాయని తెలిసిన వెంటనే అలెర్ట్ అయ్యింది ప్రభుత్వం. ప్రకృతి మీద అంచనా ఎవరు వేయలేరు కదా? అని తెలిపారు.
Read also: Ponguleti Srinivasa Reddy: తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చాము..
Also Read
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
వచ్చిన వరద నుండి ప్రజలకు తక్షణ సాయంగా 10 వేలు ఇస్తున్నారన్నారు. అధికారుల నివేదిక ప్రకారం నష్టం అంచనా వేస్తున్నారు. ప్రజలకు విశ్వాసం నింపే లాగా సిఎం.. మంత్రులు పని చేస్తారన్నారు. కేంద్ర సహకారం కూడా తీసుకుంటుందన్నారు. హరీష్ రావు రాజకీయ పార్టీగా వెళ్ళడం తప్పు కాదన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్యలు మీదృష్టికి వస్తె సీఎంకి చెప్పండన్నారు. కానీ.. అక్కడకు పోకుండానే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లు అధికారం లో ఉండి.. ఒకే సారి అధికారం పోగానే తెరుకోలేక పోతున్నారని అన్నారు.
Read also: Minister Sitakka: ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా..
రాజకీయాలు చేసే సమయమా..? అని ప్రశ్నించారు. ముగ్గురు మంత్రులు ఏం చేస్తలేరు అంటున్నావు… ఏం చేయాలో చెప్పడం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎలా ఉండాలో మమ్మల్ని అడిగేతే మేమే ట్రైనింగ్ ఇస్తామన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్న అనుభవం మాకు ఉంది కాబట్టి అన్నారు. విమర్శలకు సమయం కాదు..ప్రభుత్వం..ప్రతిపక్షం కలిసి ప్రజల్ని ఆదుకుందామని పిలుపునిచ్చారు. హరీష్ రావు ఫ్యామిలీ..చంద్రబాబు నీ ఎప్పుడు తిడతారో.. ఎప్పుడు పొగడతారో తెలియదన్నారు. మమ్మల్ని మెచ్చుకోలేక… చంద్రబాబు నీ మెచ్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని మెచ్చుకుంటే వాళ్లకు రాజకీయంగా ఇబ్బంది కదా..? అని ప్రశ్నించారు.
Read also: Ponnam Prabhakar: ప్రకృతి విపత్తును అపగలిగే శక్తి ఎవరికీ లేదు..
ఏపీ లో ప్రతిపక్షం… తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది అంటున్నారు. తెలంగాణ లో ప్రతిపక్ష నాయకుడు గా కేసీఆర్.. ఇంట్లో ఉండే నడిపిస్తున్నాడన్నారు. సీఎం గా ఉన్నా.. ఇంట్లో ఉండే నడిపించారు.. ఆయన ఇష్టం అది అన్నారు. కాంగ్రెస్ ప్రాక్టికల్ పార్టీ… వాస్తవాలకు దగ్గర ఉంటామన్నారు. బీఆర్ఎస్ అవాస్తవాలకు దగ్గర ఉంటుందన్నారు. మేము పనికి ఎక్కువ.. పబ్లిసిటీ కి తక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు పబ్లిసిటీ కి దగ్గర.. పనికి దూరంగా ఉంటారన్నారు. మా మంత్రుల మైండ్ అంతా ప్రజలను ఎలా ఆదుకోవాలి అనేదాని మీదనే ఉంటదన్నారు.
Hydra Commissioner: హైడ్రా పేరుతొ డబ్బు వసూళ్ల కు పాల్పడితే జైలుకే.. హైడ్రా కమిషనర్ వార్నింగ్..
తాజావార్తలు
-
PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
-
YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
-
Nizam Exhibitors: మేం పెద్ది సినిమాని టార్గెట్ చేయలేదు.. పర్సనల్ టార్గెట్ చేశారు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?