Ponguleti Srinivasa Reddy: తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చాము..
- కేంద్రం నుంచి పరిశోధన జరిపించి కారణాలు గుర్తించాలి..
- కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి..
- అటవి ప్రాంతంలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి..
Ponguleti Srinivasa Reddy: ఎక్కడైనా తడిచిన ధాన్యం ఉంటే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాచారంలో ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా తెలంగాణా లోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయని అన్నారు. భారీ వరదల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. అర్ధరాత్రి వచ్చిన వరదలతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. గడిచిన 100 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున వరదలు ఎప్పుడూ రాలేదన్నారు. వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని తెలిపారు.
Read also: Minister Sitakka: ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా..
Also Read
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
- Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాకు వచ్చి వరదల వల్ల ఏర్పడిన పరిస్థితి చూసారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. వరదలను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 5438 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే 2 వేల కోట్లు ఇచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి లేఖ రాశారని తెలిపారు. కేంద్రం ఆంద్రప్రదేశ్ కి ఏవిధంగా సాయం చేస్తుందో తెలంగాణాకి కూడా అలాగే చేయాలని తెలిపారు. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎక్కడైనా తడిచిన ధాన్యం ఉంటే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చాము.
Ponnam Prabhakar: ప్రకృతి విపత్తును అపగలిగే శక్తి ఎవరికీ లేదు..
తాజావార్తలు
-
Fish Price Down: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన ట్యూనా ఫిష్ ధర..
-
AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి ‘నాబార్డ్’ ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
-
PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
-
Karuppu : మే 14న ‘వీరభద్రుడు’కి లైన్ క్లియర్
-
Chiranjeevi: ఆర్.బి. చౌదరి ఆకస్మిక దుర్మరణం మనసుని కలిచివేసింది!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!