Hyderabad: గచ్చిబౌలి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఫ్రిడ్జ్ లో పాడైన కూరగాయలు
- గచ్చిబౌలి లోని ఓవర్ ది మూన్ పబ్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..
- కాలం చెల్లిన వస్తువులతో పాటు అపరిశుభ్రంగా ఉన్న కిచెన్..
- బొద్దింకలతో పాటు పాడైన కూరగాయలు నిల్వ ఉంచిన ది మూన్ పబ్ యజమాన్యం..
- ఎటువంటి గుర్తింపు లేని ఏడు ప్యాకెట్ ల సాస్ గుర్తించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా ఆహార భద్రత అధికారులు తనిఖీలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం పాడవడంతో పాటు, కుళ్లిపోయిన మాంసం, వంటగదిలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బయట తినేందుకు జనం భయాందోళన చెందుతున్నారు. ఇక తాజాగా.. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి లోని ఓవర్ ది మూన్ పబ్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. కిచెన్ లో కాలం చెల్లిన వస్తువులతో పాటు, అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులు మండిపడ్డారు.
ఫ్రిడ్జ్ లో ఎటువంటి లేబుల్స్ లేకుండా నిల్వ ఉంచిన పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. బొద్దింకలతో పాటు పాడైన కూరగాయలు నిల్వ ఉంచడంతో మూన్ పబ్ యజమాన్యంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రశ్నించారు. ఎటువంటి గుర్తింపు లేని ఏడు ప్యాకెట్ ల సాస్ అను అధికారులు గుర్తించారు. మెడికల్ సర్టిఫికెట్ లేకుండ మెయింటైన్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మూన్ పబ్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. ఇటీవల హైదరాబాద్లోని పలు ఆహార కేంద్రాలపై తెలంగాణ ఆహార భద్రత శాఖ తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. గడువు ముగిసిన ఆహారం, తెగుళ్లు, లైసెన్స్లు/రికార్డులు లేకపోవడం, అపరిశుభ్ర పరిస్థితులు టాస్క్ఫోర్స్ గుర్తించిన విషయం తెలిసిందే.
ED Raids On AAP MP House: ఆప్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు.. మండిపడిన మనీష్ సిసోడియా..
Also Read
- Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
- Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
- Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
తాజావార్తలు
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!