Diwali Celebrations: దీపావళి వేడుకల్లో అపశృతులు.. 48 మందికి గాయాలు.. 9 మందికి సీరియస్
- దీపావళి బాణసంచా కాలుస్తూ గాయపడిన 48 మంది సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్స..
- 9 మంది సీరియస్- 34 మందికి స్వల్ప గాయాలు
Diwali Celebrations: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. టపాసుల దుకాణాలతో మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. యువకులు, వృద్ధులు పటాకులు పేల్చుతూ ఆనందంగా గడిపారు. టపాకులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అయితే దీపావళి వేడుకల్లో పలు చోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి. జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నా అవి పాటించకుండా చివరకు పండుగ పూట ఆసుపత్రి బాట పట్టారు బాధితులు. నగరంలో దీపావళి వేడుకల సందర్భంగా పలుచోట్ల టపాసులు కాలుస్తూ కంటికి గాయాలైన ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోచోట పటాకులు కాల్చి పలువురు గాయపడ్డారు. దీంతో బాధితులంతా సరోజినీదేవి కంటి ఆస్పత్రి వద్ద బారులు తీరారు. ఇప్పటి వరకు 50 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి చేరుకున్నారు. ఇందులో 9 మందికి సీరియస్గా వున్నట్లు వైద్యులు తెలిపారు. వారందరికి ప్రథమ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా 34 మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
సరోజినీ ఐ హాస్పిటల్ డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ.. దీపావళి బాణసంచా కాలుస్తూ 50 మంది గాయపడి సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారని తెలిపారు. ఇందులో 9మంది అడ్మిట్ అయ్యారని తెలిపారు. 9 మందికి శస్త్ర చికిత్స అవసరం లేదన్నారు. 9 మంది ని అబ్జర్వేషన్ లో పెట్టాము వారికి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తామన్నారు. సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు ఒపి ద్వారా మొత్తం 5 0మంది చికిత్స కోసం గాయపడ్డారు వచ్చారని క్లారిటీ ఇచ్చారు. 34 మందికి స్వల్ప గాయాలు అయ్యాయని, గాయపడ్డవారిలో 35 మంది చిన్నారులు ఉన్నారు 15మంది పెద్దలు ఉన్నారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సరోజిని కంటి ఆస్పత్రికి గాయపడ్డవారు చికిత్స కోసం వచ్చారన్నరు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి క్షతగాత్రుల సంఖ్య తగ్గిందన్నారు. చాలావరకు అవేర్నెస్ రావడం వల్లే మేజర్ గా గాయపడ్డ వారు ఎవరు లేరన్నారు. గత సంవత్సరం 72 మంది చికిత్స కోసం వచ్చారని, కానీ ఈ సారి 50 మంది చికిత్స కోసం వచ్చారు ఇందులో సీరియస్ కేసులు లేవని స్పష్టం చేశారు.
Astrology: నవంబర్ 1, శుక్రవారం దినఫలాలు
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!