Diwali Celebrations: దీపావళి వేడుకల్లో అపశృతులు.. 48 మందికి గాయాలు.. 9 మందికి సీరియస్
- దీపావళి బాణసంచా కాలుస్తూ గాయపడిన 48 మంది సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్స..
- 9 మంది సీరియస్- 34 మందికి స్వల్ప గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Celebrations: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. టపాసుల దుకాణాలతో మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. యువకులు, వృద్ధులు పటాకులు పేల్చుతూ ఆనందంగా గడిపారు. టపాకులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అయితే దీపావళి వేడుకల్లో పలు చోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి. జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నా అవి పాటించకుండా చివరకు పండుగ పూట ఆసుపత్రి బాట పట్టారు బాధితులు. నగరంలో దీపావళి వేడుకల సందర్భంగా పలుచోట్ల టపాసులు కాలుస్తూ కంటికి గాయాలైన ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోచోట పటాకులు కాల్చి పలువురు గాయపడ్డారు. దీంతో బాధితులంతా సరోజినీదేవి కంటి ఆస్పత్రి వద్ద బారులు తీరారు. ఇప్పటి వరకు 50 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి చేరుకున్నారు. ఇందులో 9 మందికి సీరియస్గా వున్నట్లు వైద్యులు తెలిపారు. వారందరికి ప్రథమ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా 34 మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
సరోజినీ ఐ హాస్పిటల్ డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ.. దీపావళి బాణసంచా కాలుస్తూ 50 మంది గాయపడి సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారని తెలిపారు. ఇందులో 9మంది అడ్మిట్ అయ్యారని తెలిపారు. 9 మందికి శస్త్ర చికిత్స అవసరం లేదన్నారు. 9 మంది ని అబ్జర్వేషన్ లో పెట్టాము వారికి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తామన్నారు. సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు ఒపి ద్వారా మొత్తం 5 0మంది చికిత్స కోసం గాయపడ్డారు వచ్చారని క్లారిటీ ఇచ్చారు. 34 మందికి స్వల్ప గాయాలు అయ్యాయని, గాయపడ్డవారిలో 35 మంది చిన్నారులు ఉన్నారు 15మంది పెద్దలు ఉన్నారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సరోజిని కంటి ఆస్పత్రికి గాయపడ్డవారు చికిత్స కోసం వచ్చారన్నరు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి క్షతగాత్రుల సంఖ్య తగ్గిందన్నారు. చాలావరకు అవేర్నెస్ రావడం వల్లే మేజర్ గా గాయపడ్డ వారు ఎవరు లేరన్నారు. గత సంవత్సరం 72 మంది చికిత్స కోసం వచ్చారని, కానీ ఈ సారి 50 మంది చికిత్స కోసం వచ్చారు ఇందులో సీరియస్ కేసులు లేవని స్పష్టం చేశారు.
Astrology: నవంబర్ 1, శుక్రవారం దినఫలాలు
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
-
Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!