What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- ద్వారకా తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
- నేటి నుంచి భారత్-న్యూజిలాండ్ మూడో టెస్ట్
- నేడు స్టాక్ ఎక్స్ఛేంజీలు మూరత్ ట్రేడింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈదుపురంలో దీపం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. దీపం పథకంతో కోటి 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.
నేడు ఏలూరు ద్వారకా తిరుమల మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఐయస్ జగన్నాధపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని పవన్ దర్శించుకోనున్నారు. అనంతరం దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయనునున్నారు.
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
నేటి నుంచి తూర్పుగోదావరి జిల్లా రేషన్ షాపుల్లో కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. పాయింట్లకు సరిపడా సరుకులను ఇప్పటికే పౌరసరఫరాలశాఖ రవాణా చేసింది. రేషన్ కార్డ్ దారులందరికీ ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
శ్రీ సత్యసాయి జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ధర్మవరం పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయాన్ని సందర్శించి.. 9:30 నిమిషాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
2024 దీపావళి నుంచి సంవత్ 2081 ఆరంభం కానుంది. దేశమంతా నిన్న దీపావళి జరుపుకోగా.. నేడు స్టాక్ ఎక్స్ఛేంజీలు మూరత్ ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. అంటే శుక్రవారం మార్కెట్లు పూర్తి స్థాయిలో పనిచేయవు. సాయంత్రం ఓ గంట పాటు మాత్రం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ జరుగుతుంది.
రోజూ వినియోగించే క్రెడిట్ కార్డులతో పాటు రైలు టికెట్ బుకింగ్ విషయంలో ఐఆర్సీటీసీ కొత్త మార్పులూ నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో కోతలు, నగదు బదిలీలో మార్పులు, రైలు టికెట్కు సంబంధించి కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
నేటి నుంచి ముంబైలో న్యూజిలాండ్తో భారత్ మూడో టెస్ట్ ఆడనుంది. స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత భారత్ సిరీస్ ఓటమిని ఎదుర్కొంది. మూడు టెస్టుల సిరీస్లో రెండు టెస్టుల్లో ఓడి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో గెలిచి పరువు కాపాడుకోవాలి భారత్ చూస్తోంది.
తాజావార్తలు
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?