What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- ద్వారకా తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
- నేటి నుంచి భారత్-న్యూజిలాండ్ మూడో టెస్ట్
- నేడు స్టాక్ ఎక్స్ఛేంజీలు మూరత్ ట్రేడింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈదుపురంలో దీపం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. దీపం పథకంతో కోటి 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.
నేడు ఏలూరు ద్వారకా తిరుమల మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఐయస్ జగన్నాధపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని పవన్ దర్శించుకోనున్నారు. అనంతరం దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయనునున్నారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
నేటి నుంచి తూర్పుగోదావరి జిల్లా రేషన్ షాపుల్లో కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. పాయింట్లకు సరిపడా సరుకులను ఇప్పటికే పౌరసరఫరాలశాఖ రవాణా చేసింది. రేషన్ కార్డ్ దారులందరికీ ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
శ్రీ సత్యసాయి జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ధర్మవరం పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయాన్ని సందర్శించి.. 9:30 నిమిషాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
2024 దీపావళి నుంచి సంవత్ 2081 ఆరంభం కానుంది. దేశమంతా నిన్న దీపావళి జరుపుకోగా.. నేడు స్టాక్ ఎక్స్ఛేంజీలు మూరత్ ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. అంటే శుక్రవారం మార్కెట్లు పూర్తి స్థాయిలో పనిచేయవు. సాయంత్రం ఓ గంట పాటు మాత్రం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ జరుగుతుంది.
రోజూ వినియోగించే క్రెడిట్ కార్డులతో పాటు రైలు టికెట్ బుకింగ్ విషయంలో ఐఆర్సీటీసీ కొత్త మార్పులూ నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో కోతలు, నగదు బదిలీలో మార్పులు, రైలు టికెట్కు సంబంధించి కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
నేటి నుంచి ముంబైలో న్యూజిలాండ్తో భారత్ మూడో టెస్ట్ ఆడనుంది. స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత భారత్ సిరీస్ ఓటమిని ఎదుర్కొంది. మూడు టెస్టుల సిరీస్లో రెండు టెస్టుల్లో ఓడి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో గెలిచి పరువు కాపాడుకోవాలి భారత్ చూస్తోంది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!