Emergency Landing: తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం..
- శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ -తిరుపతి ఫ్లైట్ అత్యవసర లాండింగ్..
- సాంకేతిక కారణాల కారణంగా తిరిగి అత్యవసర లాండింగ్..
- ప్రయాణికులు సురక్షితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emergency Landing: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి 66 మంది ప్రయాణికులతో తిరుపతి బయలుదేరిన అలయన్స్ ఎయిర్లైన్స్ విమానం 9I 877 సాంకేతిక కారణంగా తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలోనే అత్యవసర లాండింగ్ అయింది. ఉదయం 6.12 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన ఫ్లైట్ తిరిగి 8.17 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులోనే ల్యాండ్ అయింది. శంషాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ వెంటనే ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట సమీపంలో ఉండగా వెంటనే ATC కేంద్రానికి సమాచారం అందించాడు.
అంతేకాకుండా.. పైలెట్ ప్రయాణిలకు అలర్ట్ చేశారు. భయపడాల్సిన అవసరం లేదని ల్యాండింగ్ సిద్దంగా వున్నామని, ప్రయాణికులు సహకరించాలని కోరారు. శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పైలట్ సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసర ల్యాండింగ్కు అనుమతించారు. దీంతో పైలట్ విమానాన్ని ఒంటిమిట్ట నుంచి తిరిగి శంషాబాద్ లో ల్యాండ్ చేశాడు. విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు సిబ్బంది వెల్లడించారు. విమానంలో మొత్తం 66 మంది ప్రయాణికులు ఉన్నారని ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలో సాంకేతిక లోపం సరి చేసిన వెంటనే తిరుగు ప్రయాణించేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. ప్రయాణికులకు రెస్ట్ రూం ఏర్పాటు చేశామన్నారు.
Also Read
Hyderabad: బైక్ పై అబ్బాయి ఒడిలోనే అమ్మాయి.. హద్దులు దాటి ముద్దులు..
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!