Kolkata Doctor Case: ఆందోళనకు ఐఎంఏ పిలుపు.. ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద ధర్నా..
- ఇవ్వాళ 24 గంటల పాటు దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో OP సేవలు బంద్..
- కలకత్తా వైద్యురాలు పై జరిగిన హత్యాచారం నేపథ్యంలో నిరసన..
- ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను నిలిపివేత..
- రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జూడాలు OP సేవలను బహిష్కరించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: కలకత్తా వైద్యురాలు పై జరిగిన హత్యాచారం నేపథ్యంలో 24 గంటల పాటు దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్ చేయనున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసనలో వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, మొత్తం వైద్య సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను ప్రభుత్వ వైద్యులు నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జూడాలు ఓపీ సేవలను బహిష్కరించారు. ఇటు అన్ని ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా OP, తాత్కాలిక సేవలను నిలిపివేసి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొలకత్తా ఘటనపై వైద్యులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది.
Read also: Harish Rao Flexi: సిద్దిపేటలో అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం..
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
ఇవ్వాళ రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మినహా… అన్ని సేవలు బహిష్కరించి ఇందిరాపార్క్ లోని ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వైద్యులు ఆందోళకు దిగనున్నారు. అందుకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య సంఘాల ఆధ్వర్యంలో వైద్యులను పెద్ద ఎత్తున కదిలిరానున్నారు. నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఇవ్వాళ 9గంటలకు నిమ్స్ బంజారాహిల్స్ గేట్ దగ్గర నుంచి మాసబ్ ట్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. డెంటల్ డాక్టర్లు పరెడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఇవ్వాళ ఉదయం 10 గంటలకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులతో సహా అన్ని ఆస్పత్రుల జూడాలు, IMA వైద్యులు ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టనున్నారు.
Read also: Sabarmati Express: కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్..
జూడాల ఆందోళనకు పిలుపుతో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూడాలు రోడ్డుల వచ్చి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా నిరసనలు చేపట్టాలని తెలిపారు. ఎవరికి ఇబ్బందులు తావులేకుండా శాంతియుతంగా ధర్నా చేయాలని పోలీసులు సూచించారు. ధర్నా చౌక్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సికింద్రాబాద్ వద్ద కూడా పోలీసులు భారీగా చేరుకున్నారు.
CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. నేడు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో భేటీ..
తాజావార్తలు
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?