Kolkata Doctor Case: ఆందోళనకు ఐఎంఏ పిలుపు.. ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద ధర్నా..
- ఇవ్వాళ 24 గంటల పాటు దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో OP సేవలు బంద్..
- కలకత్తా వైద్యురాలు పై జరిగిన హత్యాచారం నేపథ్యంలో నిరసన..
- ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను నిలిపివేత..
- రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జూడాలు OP సేవలను బహిష్కరించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: కలకత్తా వైద్యురాలు పై జరిగిన హత్యాచారం నేపథ్యంలో 24 గంటల పాటు దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్ చేయనున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసనలో వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, మొత్తం వైద్య సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను ప్రభుత్వ వైద్యులు నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జూడాలు ఓపీ సేవలను బహిష్కరించారు. ఇటు అన్ని ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా OP, తాత్కాలిక సేవలను నిలిపివేసి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొలకత్తా ఘటనపై వైద్యులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది.
Read also: Harish Rao Flexi: సిద్దిపేటలో అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం..
Also Read
- TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
- Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Akhil Raj: "డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
ఇవ్వాళ రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మినహా… అన్ని సేవలు బహిష్కరించి ఇందిరాపార్క్ లోని ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వైద్యులు ఆందోళకు దిగనున్నారు. అందుకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య సంఘాల ఆధ్వర్యంలో వైద్యులను పెద్ద ఎత్తున కదిలిరానున్నారు. నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఇవ్వాళ 9గంటలకు నిమ్స్ బంజారాహిల్స్ గేట్ దగ్గర నుంచి మాసబ్ ట్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. డెంటల్ డాక్టర్లు పరెడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఇవ్వాళ ఉదయం 10 గంటలకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులతో సహా అన్ని ఆస్పత్రుల జూడాలు, IMA వైద్యులు ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టనున్నారు.
Read also: Sabarmati Express: కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్..
జూడాల ఆందోళనకు పిలుపుతో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూడాలు రోడ్డుల వచ్చి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా నిరసనలు చేపట్టాలని తెలిపారు. ఎవరికి ఇబ్బందులు తావులేకుండా శాంతియుతంగా ధర్నా చేయాలని పోలీసులు సూచించారు. ధర్నా చౌక్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సికింద్రాబాద్ వద్ద కూడా పోలీసులు భారీగా చేరుకున్నారు.
CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. నేడు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో భేటీ..
తాజావార్తలు
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
-
Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
ట్రెండింగ్
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!