Heatwave in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
- తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు..
- ఏపీలో 275 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణొగ్రతలు ..
- ఇవాళ 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం..
- తెలంగాణలోనూ మండిపోతున్న ఉష్ణోగ్రతలు..
- పలు ప్రాంతాల్లో 41-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు..
- పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heatwave in Telugu States: నిప్పుల కొలిమి.. నిప్పుల కుంపటి.. ఈ పదాలకు అర్థాలు తెలుసుకోవాలనుందా.. ఉదయం 9 గంటలకు అలా రోడ్డెక్కండి చాలు.. అర్థాలు తెలుసుకోవడమే కాదు.. స్పెల్లింగ్ కూడా రాసేస్తారు. అట్టుంటది మనతోని అని భాస్కరుడు భగ్గుమంటుంటే.. ఇవేం ఎండల్రా నాయనా అంటూ జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏప్రిల్లోనే రోహిణి రేంజ్లో సూర్యప్రతాపం కనిపిస్తోంటే.. ఇంకో మూడు నాలుగు రోజులు ఇళ్లల్లోనే ఉండండి అని అధికారులు అలర్ట్ చేస్తున్నారు. రెయినీ సీజన్లో వానలు దంచికొడుతున్నాయ్ అంటాం కదా.. ఈ సమ్మర్లో ఎండ దంచికొడుతోంది అనాల్సి వస్తోంది. ఎందుకంటే.. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఆరు గంటలకే ప్రజెంట్ సర్ అంటూ అటెండెన్స్ ఇస్తున్న సూర్యుడు.. నిమిష నిమిషానికి నిప్పుల కొలిమిలా మారిపోతున్నాడు. 9 గంటలకే మాడు పగిలే రేంజ్లో నిప్పులు కురిపిస్తున్నాడు. పదయ్యే సరికి టెంపరేచర్ సర్రున పెరిగిపోతోంది. ఇంకో అరగంట కాకుండానే.. 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు భగభగలుంటున్నాయి.
Read Also: PM Modi: తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి గౌరవం
Also Read
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Lakshmis Empiria : వర్షాన్నీ లెక్కచేయని 5K రన్.. మియాపూర్లో సందడి.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 45 డిగ్రీల టెంపరేచర్ టచ్ అయింది. మరో మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న మాటలు.. జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లోనుంచి రావొద్దని అధికారులు చెబుతుంటే.. హైరానా పడిపోతున్నారు. మూడు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు ఏపీలో భానుడి ప్రతాపంతో నిప్పుల వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని 275 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతుంటే.. ఇవాళ మరింతగా పెరిగే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు హీట్ అలర్ట్ జారీ చేసింది. 34 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని.. 67 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుందని అంచనా వేసింది. నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. పల్నాడు జిల్లా గురజాలలో 44.5 డగ్రీల టెంపరేచర్ నమోదయింది. రాబోయే రెండు, మూడు రోజులు.. 28 మండలాల్లో తీవ్ర వడగాలులు.. 37 మండలాల్లో వడగాలు వీచే అవకాశం ఉంది. ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున్న జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!