Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meenakshi Natarajan: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశంపై కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ స్పందించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, దీనిపై న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తన నామినేషన్ తిరస్కరణకు కారణంగా చెబుతున్న అంశాలపై వివరణ ఇచ్చిన ఆమె.. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అన్నారు. లీగల్ నోటీసు మాత్రమే వచ్చిందని, అది కూడా ఒక ప్రైవేట్ పిటిషన్కు సంబంధించినదేనని తెలిపారు. ఫార్మ్-26లో లీగల్ నోటీసులను తప్పనిసరిగా పేర్కొనాల్సిన నిబంధన లేదని చెప్పారు.
ప్రైవేట్ పిటిషన్ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఆ ఘటన జరిగిన సమయంలో తాను ఇంచార్జిగా కూడా లేనని తెలిపారు. నాంపల్లి కోర్టు కూడా ఆ కేసు తన పరిధిలోకి రాదని పేర్కొన్నట్లు చెప్పారు. పిటిషన్ దాఖలు చేసిన మహిళకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని ఆమె వెల్లడించారు. ఫిర్యాదులో ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు టికెట్ కూడా నిరాకరించామని చెప్పారు. పార్టీ పరంగా అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని వివరించారు. తన నామినేషన్ తిరస్కరణపై తాను నిరాశ చెందలేదని, ఇప్పటికే ఎన్నికల పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
Also Read
రాజ్యసభకు వెళ్లేందుకు తెలంగాణ నుంచి ఎవరినైనా తప్పించి తనను పంపించే ప్రయత్నం జరుగుతోందన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. తెలంగాణ కాంగ్రెస్లో ప్రతి నాయకుడు తమకు ముఖ్యమేనని పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంలో తనపై పార్టీలోనే కుట్ర జరిగిందన్న ఆరోపణలను కూడా మీనాక్షి నటరాజన్ కొట్టిపారేశారు. సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపిందని, ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ కుట్ర కనిపిస్తోందని ఆరోపించారు. జార్ఖండ్లో కూడా సంఖ్యాబలం లేకుండానే బీజేపీ పోటీకి దిగిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు అనుకూలంగా సంఖ్యాబలం ఉందని, బీజేపీకి మూడో సీటు గెలిచేంత మంది ఎమ్మెల్యేలు లేరని ఆమె పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!