Telangana: జిల్లాలను కమ్మేసిన పొగమంచు.. హెడ్ లైట్ల వెలుతురులో ప్రయాణం..
- మంచుదుప్పటి కప్పుకున్న తెలంగాణ..
- పల్లెలే కాదు కశ్మీరాన్ని తలపిస్తున్న జిల్లా కేంద్రాలు..
- వాహనదారులు- పాదచారులకు ఇబ్బందిగా మారిన ప్రయాణం..
Telangana: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలను పొగమంచు కమ్మేసింది. జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాను పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. పల్లెలే కాదు.. జిల్లా కేంద్రం కశ్మీరాన్ని తలపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచే దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో రహదారిపై హెడ్ లైట్ల వెలుతురులో నెమ్మదిగా వాహనాలు ముందుకు సాగుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలలో చలి గణనీయంగా పెరిగింది. బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజురోజుకి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం పనులకు వెళ్లే వారికి ఇబ్బందిగా మారింది. జిల్లాల్లో ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో కశ్మీరాన్ని తలపిస్తుంది. ఉదయం రహదారుల్లో నడవాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎదుటి వాహనాలు కూడా మంచులో కనిపించకపోవడంతో రహదారుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంంటున్నారు.
Read also: Bhadradri: భద్రాద్రికి కార్తీక శోభ.. శివాలయంలో నేటి పూజలు..
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
జిల్లాలకు కమ్మేసిన పొగమంచు..
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పొగమంచు కురుస్తుంది. ఉదయం 6.30 గంటలైనా జగిత్యాల – నిజామాబాద్ జాతీయ రహదారి కనపడటం కష్టంగా మారింది. దీంతో వాహనదారులు హెడ్ లైట్ల వెలుతురులోనే నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. ఎదుట పొగమంచు కమ్ముకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాని పొగమంచు కమ్మేసింది. సంగారెడ్డి, కంది, రుద్రారం, జోగిపేట, చౌటకూర్ ప్రాంతాల్లో మంచు దట్టంగా కమ్మేసింది. ఔటర్ రింగ్ రోడ్డు, NH-65, NH-161 పై వాహనాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. వాహనాల హెడ్ లైట్ లు, ఇండికేటర్ వేసుకుని వాహనదారులు నెమ్మదిగా వస్తున్నాయి. స్కూల్, ఉద్యోగాలకు వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read also: Karthika Masam: ఆ చెట్టు కింద భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం ఫలితం దక్కుతుంది..
మరోవైపు పటాన్చెరు, రామచంద్రపురం, లింగంపల్లి ,అవుటర్ రింగ్ రోడ్డు ,ముత్తంగి, ఇస్నాపూర్ లో పొగ మంచు కమ్మేసింది. వాహనదారులు తమ వాహనాలకు లైట్లు ఆన్ చేసుకొని నడుపే పరిస్థితి వచ్చింది. పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులకు పాదచారులు కనిపించడం కష్టంగా మారింది. విద్యార్థులకు స్కూల్ టైం, ఆఫీస్ వాళ్లకు జాబ్ టైం రోడ్డు క్రాస్ చేయాలంటే పొగ మంచు కారణంగా ఇబ్బంది పడుతున్నారు. పొగ మంచు కారణంగా ఎదుటి వాహనాలు కనిపించడం లేదు. దీంతో జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేయవలసి వస్తుంది. వికారాబాద్ జిల్లాలో భారీగా మంచు కమ్మేయడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనచోదకులు దగ్గరికి వచ్చే వరకు ఒక వాహనానికి మరో వాహనం కనబడకుండా ఇబ్బంది పడుతున్న వాహనదారులు వాపోతున్నారు.
Bhadradri: భద్రాద్రికి కార్తీక శోభ.. శివాలయంలో నేటి పూజలు..
తాజావార్తలు
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో