Karthika Masam: ఆ చెట్టు కింద భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం ఫలితం దక్కుతుంది..
- కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు
- లక్ష్మీ దేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం..
- కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించిన- దాని నీడలో భోజనాలు చేసిన అశ్వమేధ యాగం ఫలితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthika Masam: హిందూ సంప్రదాయాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో హిందువులు భక్తి, శ్రద్ధలతో శివున్ని ఆరాధిస్తుంటారు. ఈ మాసంలోనే పరమ పవిత్రమైన ఉసిరి చెట్టుకు కూడా పూజలు చేస్తుంటారు. ఉసిరి చెట్టును సాక్షాత్తు శ్రీ మహా విష్ణువుగా భావించి ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకిందనే భోజనాలు చేయాలనే సంప్రదాయం ఎందుకొచ్చిందో తెలుసా..?
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
- Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
- Chanakya Niti: జీవితంలో గెలవాలంటే 'చాణక్యుడి' ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
- Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం చెబుతుంది. ఉసిరి చెట్టును భూమాతగా కూడా కొలుస్తారు. దేవుళ్ల కాలంలో దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరిలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు వృద్దాప్యాన్ని దరిచేరనివ్వవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా.. ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అటువంటి ఉసిరి చెట్టుని ధాత్రీ వృక్షమని అంటారు. ఉసిరి ఆరోగ్యానికి సంజీవినిలాంటిది. శ్రీ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన చెట్టు అని ఆచారాలు చెబుతాయి. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వలన, దాని నీడలో భోజనాలు చేయడం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందట.
Read also: Dua Padukone Singh: కూతురికి నామకరణం చేసిన రణ్వీర్ సింగ్ దంపతులు.. పేరేంటంటే?
తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం దిక్కులతో పాటు నాలుగు మూలలు అంటూ మొత్తం ఎనిమిది దిక్కుల్లో దీపాలను వెలిగించి.. చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేసి తరవాత చెట్టునీడలో భోజనాలు చేయాలి. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, పైన బ్రహ్మదేవుడు, ఉసిరి కొమ్మల్లో సూర్యుడు, చిన్న చిన్న కొమ్మలో సకల దేవతలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కార్తీకమాసంలో ఉసిరికాయపై ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు. అలా చేయడం అత్యంత శుభకరంగా భావిస్తారు. ఈ దీపం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగి పోవడంతో పాటు దుష్టశక్తులు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా.. నరదిష్టి కూడా ఆ ఇంటికి తగలదని చెబుతుంటారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
-
Japan Earthquake: జపాన్లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!