Bhadradri: భద్రాద్రికి కార్తీక శోభ.. శివాలయంలో నేటి పూజలు..
- భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో నేటి నుంచి కార్తీక మాస పూజోత్సవాలు..
- రామాలయం-అన్నపూర్ణతో పాటు కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kartika Shobha for Bhadradri: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో నేటి నుంచి కార్తీక మాస పూజోత్సవాలు నిర్వహించనున్నారు. రామాలయంతో పాటు, అన్నపూర్ణతో పాటు కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రతి కార్తీక సోమవారం నాడు జ్యోతిర్లింగ, ఆకాశ దీపోత్సవాలు, నీరాజన మంత్ర పుష్ప పూజలు నిర్వహిస్తారు. 4న స్వామివారికి భస్మాభిషేకం, 11న చందనోత్సవం, 15న రుద్రాభిషేకం, 17న స్వామివారికి కల్యాణ మహోత్సవం, 18న పుష్పోత్సవం, 25న మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన నిర్వహించనున్నారు. ప్రతి సోమవారం ఉదయం, సాయంత్రం ప్రసాద వినియోగం, ప్రవచనాలు ఉంటాయి. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో నిర్దేశిత ప్రత్యేక రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు, 27న నాడి హారతి నిర్వహిస్తారు. దేవస్థానం ఆధ్వర్యంలో వ్యాపారాలకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నారు.
శివాలయంలో నేటి పూజలు
Also Read
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
- Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
- Ram Mandir CEO Vacancy: రామ మందిరం సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏంటి..? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసా?
దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు వేదపండితులు సన్యాసి శర్మచే కార్తీక పురాణ ప్రవచనం, 6.30 గంటలకు లలిత సహస్రనామార్చన, రాత్రి 7 గంటలకు భద్రాచలం వాస్తవ్యులు లలిత, వాణిలచే భక్తి సంగీతం, రాత్రి 7.30 గంటల నుంచి నృత్య ప్రదర్శనలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు.
రాముడికి బంగారు కవచం..
ఆలయ ప్రవేశ మందిరంలో శుక్రవారం స్వామివారి విగ్రహాలు బంగారు కవచం ధరించి భక్తులకు దర్శనమిచ్చాయి. తెల్లవారుజామునే గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, పూజలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిత్య కల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యవచనం నిర్వహించారు. నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ చేసి శాస్త్రోక్తంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Karthika Masam: ఆ చెట్టు కింద భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం ఫలితం దక్కుతుంది..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!