Tollywood Team: సీఎం రేవంత్తో ముగిసిన సినీ ప్రముఖులు భేటీ.. ఎవరెవరు ఏమన్నారంటే..
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సీనీ పెద్దలు భేటీ ముగిసింది..
- సంధ్య థియేటర్ ఘటనతో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సీఎంతో సమావేశం..
- రెండు గంటలపాటు సాగిన సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Team: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సీనీ పెద్దలు భేటీ ముగిసింది. సంధ్య థియేటర్ ఘటనతో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సీఎంతో సమావేశమయ్యారు. రెండు గంటలపాటు సాగిన సమావేశంలో బెనిఫిట్ షో, టికెట్ల పెంపుపై మాట్లాడారు. దీనిపై స్పందించిన సీఎం బెనిఫిట్ షో, టికెట్ల పెంపు ఉండదని తేల్చిచెప్పారు. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యుల హాజరు కాగా.. రాఘవేంద్ర రావు, మురళీ మోహన్, దిల్ రాజు, శ్యాంప్రసాద్రెడ్డి, దగ్గుబాటి సురేష్బాబు, త్రివిక్రమ్, నాగార్జున సమావేశంలో మాట్లాడారు. బెనిఫిట్ షో, టికెట్ పెంపుపై సీఎంతో చర్చించిన ఫలితం లేకుండా పోయింది.
Read also: CM Revanth Comments: నో బెనిఫిట్ షో.. టాలీవుడ్ ఇండ్రస్ట్రీకి రేవంత్ సర్కార్ బిగ్ షాక్..
సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల మాటలు
Also Read
రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోందన్నారు. దిల్ రాజును FDC చైర్మన్గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని తెలిపారు. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లో చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను.. హైదరాబాద్లో నిర్వహించాలని రాఘవేంద్రరావు కోరారు.
నాగార్జున మాట్లాడుతూ.. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని తెలిపారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే.. సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక అన్నారు.
Read also: IRCTC: ఐఆర్సీటీసీ సేవల్లో మళ్లీ అంతరాయం.. ప్రయాణికుల అవస్థలు
మురళీమోహన్ మాట్లాడుతూ.. ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్డే ఉంటుందన్నారు. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని తెలిపారు. సినిమా రిలీజ్లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల..
ప్రమోషన్ను విస్తృతంగా చేస్తున్నామని తెలిపారు. నేను
శ్యాంప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నానని తెలిపారు. హైదరాబాద్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలన్నారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దని తెలిపారు.
దగ్గుబాటి సురేష్బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు. హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది డ్రీమ్ అని తెలిపారు. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో.. చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చిందని తెలిపారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్గా ఉండాలన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ.. మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్కి వచ్చిందని గుర్తు చేశారు.
Read also: CPI Narayana: రష్మికకు ఫీలింగ్స్ పాట చేయడం ఇష్టంలేదు.. డైరెక్టర్ చెప్పడం వల్లే చేసింది..
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!