Tollywood Team: సీఎం రేవంత్తో ముగిసిన సినీ ప్రముఖులు భేటీ.. ఎవరెవరు ఏమన్నారంటే..
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సీనీ పెద్దలు భేటీ ముగిసింది..
- సంధ్య థియేటర్ ఘటనతో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సీఎంతో సమావేశం..
- రెండు గంటలపాటు సాగిన సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Team: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సీనీ పెద్దలు భేటీ ముగిసింది. సంధ్య థియేటర్ ఘటనతో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సీఎంతో సమావేశమయ్యారు. రెండు గంటలపాటు సాగిన సమావేశంలో బెనిఫిట్ షో, టికెట్ల పెంపుపై మాట్లాడారు. దీనిపై స్పందించిన సీఎం బెనిఫిట్ షో, టికెట్ల పెంపు ఉండదని తేల్చిచెప్పారు. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యుల హాజరు కాగా.. రాఘవేంద్ర రావు, మురళీ మోహన్, దిల్ రాజు, శ్యాంప్రసాద్రెడ్డి, దగ్గుబాటి సురేష్బాబు, త్రివిక్రమ్, నాగార్జున సమావేశంలో మాట్లాడారు. బెనిఫిట్ షో, టికెట్ పెంపుపై సీఎంతో చర్చించిన ఫలితం లేకుండా పోయింది.
Read also: CM Revanth Comments: నో బెనిఫిట్ షో.. టాలీవుడ్ ఇండ్రస్ట్రీకి రేవంత్ సర్కార్ బిగ్ షాక్..
సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల మాటలు
Also Read
- Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
- Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
- CM Revanth Reddy : రాహుల్నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్కు అదే నివాళి
- Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోందన్నారు. దిల్ రాజును FDC చైర్మన్గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని తెలిపారు. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లో చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను.. హైదరాబాద్లో నిర్వహించాలని రాఘవేంద్రరావు కోరారు.
నాగార్జున మాట్లాడుతూ.. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని తెలిపారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే.. సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక అన్నారు.
Read also: IRCTC: ఐఆర్సీటీసీ సేవల్లో మళ్లీ అంతరాయం.. ప్రయాణికుల అవస్థలు
మురళీమోహన్ మాట్లాడుతూ.. ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్డే ఉంటుందన్నారు. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని తెలిపారు. సినిమా రిలీజ్లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల..
ప్రమోషన్ను విస్తృతంగా చేస్తున్నామని తెలిపారు. నేను
శ్యాంప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నానని తెలిపారు. హైదరాబాద్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలన్నారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దని తెలిపారు.
దగ్గుబాటి సురేష్బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు. హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది డ్రీమ్ అని తెలిపారు. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో.. చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చిందని తెలిపారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్గా ఉండాలన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ.. మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్కి వచ్చిందని గుర్తు చేశారు.
Read also: CPI Narayana: రష్మికకు ఫీలింగ్స్ పాట చేయడం ఇష్టంలేదు.. డైరెక్టర్ చెప్పడం వల్లే చేసింది..
తాజావార్తలు
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
-
Romanchakam Overseas Review : రోమాంచకం ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ
-
Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!