Ind vs Aus 3rd ODI: ఆసీస్ను కంగారు పెట్టిన టీమిండియా బౌలర్లు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..?
- సిడ్నీ వన్డే: భారత్ టార్గెట్ 237 పరుగులు..
- ఆస్ట్రేలియా 236 పరుగులకు ఆలౌట్..
- భారత్ బౌలింగ్: హర్షిత్ 4, సుందర్ 2, సిరాజ్, ప్రసిధ్, కుల్దీప్, అక్షర్కు తలో వికెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs Aus 3rd ODI: సిడ్నిలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. మూడో వన్డే మ్యాచ్లో భారత్కు ఆస్ట్రేలియా 237 పరుగుల టార్గెట్ ఇచ్చింది. టాస్ గెలిచి ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల దెబ్బకు 46.4 ఓవర్లలో 236 రన్స్ కే కంగారు జట్టు ఆలౌటైంది. ఆతిథ్య బ్యాటర్లలో మ్యాట్ రెన్షా (56) హాఫ్ సెంచరీ చేయగా, భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్ల తీసుకోగా.. సిరాజ్, కుల్దీప్, అక్షర్, ప్రసిద్ధ్కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో ఆరుగురు టీమిండియా బౌలర్లు బౌలింగ్ చేశారు. అందరు వికెట్లు తీయడం గమనార్హం. 1986 తర్వాత ఇలా ఆసీస్పై ప్రతి ఒక్క బౌలరూ వికెట్ తీయడం ఇదే మొదటిసారి అని చెప్పాలి.
Read Also: Elderly Man Beaten: అసలు వీడు.. మనిషా.. మృగమా… పెద్దమనిషని చూడకుండా…
Also Read
- Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
- Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
- Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
కాగా, సిడ్నీ పిచ్ బ్యాటర్లకు సహకరిస్తుందని ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ తీసుకుంది. అందుకు తగినట్టుగానే ఓపెనర్లు తొలి వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ (29) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో భారత్కు భారీ లక్ష్యం తప్పదని అందరు అనుకున్నారు. కానీ, సిరాజ్ అద్భుతమైన బంతిని ఆడబోయిన ట్రావిస్ హెడ్ బ్యాక్వర్డ్ పాయింట్లోని ప్రసిద్ధ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు వెళ్లాడు. అనంతరం కాసేపటికే మిచెల్ మార్ష్ను అక్షర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక, మాథ్యూ షార్ట్ (30), అలెక్స్ కేరీ(24)తో కలిసి రెన్షా ఆసీస్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. మరోసారి టీమిండియా బౌలర్లు రెచ్చిపోవడంతో ఆసీస్ క్రమంగా వికెట్లను కోల్పోయింది. రెన్షా ఇచ్చిన క్యాచ్ను విరాట్ కోహ్లీ అద్భుతంగా పట్టుకున్నాడు. చివర్లో కూపర్ కనోలీ (23), నాథన్ ఎల్లిస్ (16) కాస్త దూకుడుగా ఆడినప్పటికీ ఆస్ట్రేలియా స్కోరు 230 పరుగులు దాటింది. కీలక సమయంలో ఎల్లిస్ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయడంతో.. కంగారు జట్టు ఇన్నింగ్స్ ముగియడానికి పెద్దగా టైం పట్టలేదు. అలాగే, అలెక్ట్ ఇచ్చిన క్యాచ్ పడుతూ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. దీంతో వెంటనే అతడు స్టేడియం వీడాడు.
తాజావార్తలు
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
-
CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
-
Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
-
China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
-
Nagarjuna: నాగార్జునకు బర్త్డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!