Ind vs Aus 3rd ODI: ఆసీస్ను కంగారు పెట్టిన టీమిండియా బౌలర్లు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..?
- సిడ్నీ వన్డే: భారత్ టార్గెట్ 237 పరుగులు..
- ఆస్ట్రేలియా 236 పరుగులకు ఆలౌట్..
- భారత్ బౌలింగ్: హర్షిత్ 4, సుందర్ 2, సిరాజ్, ప్రసిధ్, కుల్దీప్, అక్షర్కు తలో వికెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs Aus 3rd ODI: సిడ్నిలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. మూడో వన్డే మ్యాచ్లో భారత్కు ఆస్ట్రేలియా 237 పరుగుల టార్గెట్ ఇచ్చింది. టాస్ గెలిచి ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల దెబ్బకు 46.4 ఓవర్లలో 236 రన్స్ కే కంగారు జట్టు ఆలౌటైంది. ఆతిథ్య బ్యాటర్లలో మ్యాట్ రెన్షా (56) హాఫ్ సెంచరీ చేయగా, భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్ల తీసుకోగా.. సిరాజ్, కుల్దీప్, అక్షర్, ప్రసిద్ధ్కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో ఆరుగురు టీమిండియా బౌలర్లు బౌలింగ్ చేశారు. అందరు వికెట్లు తీయడం గమనార్హం. 1986 తర్వాత ఇలా ఆసీస్పై ప్రతి ఒక్క బౌలరూ వికెట్ తీయడం ఇదే మొదటిసారి అని చెప్పాలి.
Read Also: Elderly Man Beaten: అసలు వీడు.. మనిషా.. మృగమా… పెద్దమనిషని చూడకుండా…
Also Read
- Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
- Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
- Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
కాగా, సిడ్నీ పిచ్ బ్యాటర్లకు సహకరిస్తుందని ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ తీసుకుంది. అందుకు తగినట్టుగానే ఓపెనర్లు తొలి వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ (29) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో భారత్కు భారీ లక్ష్యం తప్పదని అందరు అనుకున్నారు. కానీ, సిరాజ్ అద్భుతమైన బంతిని ఆడబోయిన ట్రావిస్ హెడ్ బ్యాక్వర్డ్ పాయింట్లోని ప్రసిద్ధ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు వెళ్లాడు. అనంతరం కాసేపటికే మిచెల్ మార్ష్ను అక్షర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక, మాథ్యూ షార్ట్ (30), అలెక్స్ కేరీ(24)తో కలిసి రెన్షా ఆసీస్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. మరోసారి టీమిండియా బౌలర్లు రెచ్చిపోవడంతో ఆసీస్ క్రమంగా వికెట్లను కోల్పోయింది. రెన్షా ఇచ్చిన క్యాచ్ను విరాట్ కోహ్లీ అద్భుతంగా పట్టుకున్నాడు. చివర్లో కూపర్ కనోలీ (23), నాథన్ ఎల్లిస్ (16) కాస్త దూకుడుగా ఆడినప్పటికీ ఆస్ట్రేలియా స్కోరు 230 పరుగులు దాటింది. కీలక సమయంలో ఎల్లిస్ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయడంతో.. కంగారు జట్టు ఇన్నింగ్స్ ముగియడానికి పెద్దగా టైం పట్టలేదు. అలాగే, అలెక్ట్ ఇచ్చిన క్యాచ్ పడుతూ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. దీంతో వెంటనే అతడు స్టేడియం వీడాడు.
తాజావార్తలు
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?