Old Phones: అమ్మిన పాత ఫోన్లతోనే సైబర్ లింక్..? అమ్మొద్దంటున్న సీఎస్బీ..
- పాత సెల్ఫోన్లు విక్రయిస్తున్న వారికి రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక..
- పాత ఫోన్ అమ్మి ఇబ్బందులు పడే అవకాశాలు..
- పాత మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి వాటితో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు..
Old Phones: కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనే మోజులో.. పాత సెల్ఫోన్లను అమ్ముతున్న వారికి రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. పాత ఫోన్ అమ్మి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని సూచించింది. పాత మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి వాటితో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయని తెలిపింది. మరోవైపు గత ఆగస్టులో రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులు బీహార్కు చెందిన ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 4 వేలకు పైగా సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని స్పష్టం చేసింది.
ఈ ముఠాను విచారించగా పలు కీలక విషయాలు వెలుగు చూశాయన్నారు. ఇటీవల తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన రాజస్థాన్ ముఠాకు ఈ పాత ఫోన్లను కొనుగోలు చేసి విక్రయించే ముఠాలతో సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ పాత సెల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్న ముఠాలు కిలోల లెక్కన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి అందులోని సమాచారాన్ని రాబట్టి కాంటాక్ట్ నంబర్ల ఆధారంగా సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలో పట్టుబడిన ఈ ముఠా బీహార్లోని కతిహార్ జిల్లా రౌతరా ప్రాంతానికి చెందిన అక్తర్ అలీ సూచనల మేరకు పాత సెల్ఫోన్లను కొనుగోలు చేస్తుంది. అక్తర్ వారి నుంచి కిలోల చొప్పున కొనుగోలు చేసి సైబర్ నేరగాళ్లకు కీలక సమాచారాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
Also Read
Read also: Telangana Rains: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
ఇలా చేయండి..
* ఫోన్ విక్రయించే ముందు డేటాను బ్యాకప్ చేయండి.
* ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ ద్వారా సెల్ ఫోన్ లోని డేటాను పూర్తిగా తొలగించాలి. అలా చేయడం వల్ల ఇతరులు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించకుండా నిరోధించబడతారు.
* మీ ఫోన్ అన్ని ఖాతాల నుండి రిజిస్టర్ చేయబడి ఉండాలి.
* గూగుల్ ఖాతా నుండి సైన్ అవుట్ చేయండి. సెట్టింగ్లలో యూజర్లు మరియు అకౌంట్స్ ఆప్షన్కి వెళ్లి, రిమూవ్ అకౌంట్ బటన్ను క్లిక్ చేయండి.
* అయినా కూడా మీ పాత సెల్ఫోన్ను తెలియని వ్యక్తులకు అమ్మవద్దు. కొనుగోలుదారు విక్రయించడానికి మిమ్మల్ని నేరుగా సంప్రదించాలి.
* అవసరమైతే సెల్ ఫోన్ అమ్మినట్లుగా వారి చిరునామా ప్రూఫ్, ఫొటో, సంతకం తీసుకోవాలి.
Governor Jishnu Dev Varma: సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన..
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
-
AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
-
OnePlus Ace 6 Ultra: వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో