Road Accident: తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు.. 5 గురు మృతి, పలువురికి గాయాలు.
- తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళన..
- రోడ్డు ప్రమాదాల్లో 5 మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 5 మంది మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు.
పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన కూలీపని చేసే వెంకటేష్ (34) పనిమీద ఇదే గ్రామానికి చెందిన రమేష్, మల్లేష్ లను బైక్ పై ఎక్కించుకొని ఇస్నాపూర్ కు వచ్చి తిరిగి గ్రామానికి వెళుతున్నారు. ఎస్బీఐ బ్యాంక్ చౌరస్తాలో జాతీయ రహదారి దాటుతుండగా పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే లారీ వెనుకనుంచి వచ్చి బైకును ఢీ కొట్టింది. దీనితో ముగ్గురు కిందపడిపోగా వెంకటేష్ కు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. రమేష్ ను తొలుత పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తలరించారు. అయితే ప్రథమచికిత్సకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మృతిచెందాడు. ఇక మల్లేష్ కు స్వల్పగాయాలయ్యాయి. మృతుల ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి, ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
Read also: Powerful Dance: నడి రోడ్డుపై డాన్స్ చేసిన హీరోయిన్.. వీడియో వైరల్..
వికారాబాద్ జిల్లా యాలాల మండలం చెన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. లక్ష్మణ్ అనే వ్యక్తి పూజా సామాగ్రిని చెరువులో వదిలేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగి మృతి చెందాడు. పది రోజుల క్రితం లక్ష్మణ్ పెదనాన్న కొడుకు మృతి చెందగా.. దశదినకర్మ కార్యక్రమం ముగిసిన తర్వాత పూజా సామాగ్రిని చెరువులో వదిలేందుకు లక్ష్మణ్ వెళ్లాడు. కాలుజారి నీటిలో మునిగడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాలు కాపాడుకొనేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.. చివరకు ప్రాణాలు వదిలాడు. స్ధానిక సమాచారంతో ఘటనాస్థలికి చెందిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నాచారం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నాచారం హెచ్ఎంటి నగర్ వద్ద స్కూట్ పై వెళుతున్న యువతిని గ్యాస్ లారి ఢీకొట్టింది. దీంతో యువతి అక్కడిక్కడే మృతి చెందింది. స్థానిక సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. యువతి వివరాలు తెలియాల్సి ఉంది.
మేడ్చల్ న్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాక్టివా వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను వెనుక నుండి రెడీమిక్స్ వాహనం ఢీ కొట్టింది. భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్రగాయాలయ్యాయి. మేడ్చల్ పట్టణంలోని కేఎల్ ఆర్ వెంచర్ లో నివాసం ఉంటున్న రత్నం(55), మాధవరావుగా గుర్తించారు పోలీసులు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై ఘటన జరిగింది.
Tank Bund Updates: ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!