Road Accident: తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు.. 5 గురు మృతి, పలువురికి గాయాలు.
- తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళన..
- రోడ్డు ప్రమాదాల్లో 5 మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 5 మంది మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు.
పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన కూలీపని చేసే వెంకటేష్ (34) పనిమీద ఇదే గ్రామానికి చెందిన రమేష్, మల్లేష్ లను బైక్ పై ఎక్కించుకొని ఇస్నాపూర్ కు వచ్చి తిరిగి గ్రామానికి వెళుతున్నారు. ఎస్బీఐ బ్యాంక్ చౌరస్తాలో జాతీయ రహదారి దాటుతుండగా పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే లారీ వెనుకనుంచి వచ్చి బైకును ఢీ కొట్టింది. దీనితో ముగ్గురు కిందపడిపోగా వెంకటేష్ కు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. రమేష్ ను తొలుత పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తలరించారు. అయితే ప్రథమచికిత్సకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మృతిచెందాడు. ఇక మల్లేష్ కు స్వల్పగాయాలయ్యాయి. మృతుల ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి, ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read also: Powerful Dance: నడి రోడ్డుపై డాన్స్ చేసిన హీరోయిన్.. వీడియో వైరల్..
వికారాబాద్ జిల్లా యాలాల మండలం చెన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. లక్ష్మణ్ అనే వ్యక్తి పూజా సామాగ్రిని చెరువులో వదిలేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగి మృతి చెందాడు. పది రోజుల క్రితం లక్ష్మణ్ పెదనాన్న కొడుకు మృతి చెందగా.. దశదినకర్మ కార్యక్రమం ముగిసిన తర్వాత పూజా సామాగ్రిని చెరువులో వదిలేందుకు లక్ష్మణ్ వెళ్లాడు. కాలుజారి నీటిలో మునిగడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాలు కాపాడుకొనేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.. చివరకు ప్రాణాలు వదిలాడు. స్ధానిక సమాచారంతో ఘటనాస్థలికి చెందిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నాచారం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నాచారం హెచ్ఎంటి నగర్ వద్ద స్కూట్ పై వెళుతున్న యువతిని గ్యాస్ లారి ఢీకొట్టింది. దీంతో యువతి అక్కడిక్కడే మృతి చెందింది. స్థానిక సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. యువతి వివరాలు తెలియాల్సి ఉంది.
మేడ్చల్ న్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాక్టివా వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను వెనుక నుండి రెడీమిక్స్ వాహనం ఢీ కొట్టింది. భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్రగాయాలయ్యాయి. మేడ్చల్ పట్టణంలోని కేఎల్ ఆర్ వెంచర్ లో నివాసం ఉంటున్న రత్నం(55), మాధవరావుగా గుర్తించారు పోలీసులు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై ఘటన జరిగింది.
Tank Bund Updates: ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!