CPI MLA Kunamneni: బడ్జెట్కి డబ్బులు లేవు.. వాగ్దానాలు విపరీతంగా చేశారు.. వాటిని నెరవేర్చడానికి తిప్పలు
- తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ ఎమ్మెల్యే సెటైర్లు..
- బడ్జెట్కి డబ్బులు లేవు.. వాగ్దానాలు విపరీతంగా చేశారు..
- ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడానికి తిప్పలు పడుతున్నారు: ఎమ్మెల్యే కూనంనేని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI MLA Kunamneni: తెలగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి చాలా బాగా నిర్వహించారు అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాలకు నేను లేకపోయినా.. నాకు చాలా మంది ప్రజాప్రతినిధులు చెప్పారు.. అసలు మాట్లాడించేవారు కాదని.. ఎవరైనా ఏదైనా విమర్శ చేస్తే మార్షల్స్ కి పని చెప్పే వారని విన్నాను.. ఇక, బడ్జెట్ లో సామాన్యులకు ఏ ప్రభుత్వం న్యాయం చెయ్యడం లేదు.. అప్పులు ఎక్కువగా ఉన్నాయి.. హామీలు ఎక్కువగా ఉన్నాయి.. బడ్జెట్ కి డబ్బులు లేవు.. వాగ్దానాలు విపరీతంగా చేశారు.. వాటిని నెరవేర్చడానికి తిప్పలు పడుతున్నారు అని ప్రభుత్వంపై సెటైర్లు వేశారు ఆయన. అయితే, హామీలను నెరవేర్చడం కోసం ప్రిపేర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది.. రుణమాఫీలో టెక్నికల్ కారణాల వల్ల చాలా మందికి రాలేదు.. జిల్లాల్లో కొన్ని ఏరియాలో చాలా తక్కువ మందికి రుణమాఫీ జరగలేదు.. పెన్షన్, మహిళలకు 2500, ఆడ పిల్లలకు తులం బంగారం, ఇవన్నీ నెరవేర్చాలి.. బడ్జెట్ పెట్టిన దాంట్లో పూర్తి స్థాయిలో ఖర్చు చేసి అన్ని అమలు చేసేవిధంగా చూడాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
Read Also: Telangana Govt: రిటైర్డ్ ఉద్యోగులపై తెలంగాణ సర్కార్ వేటు.. 6,729 మంది తొలగింపుకి ఆదేశాలు!
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
అయితే, పెట్టిన ప్రతి రూపాయినీ ఖర్చు పెట్టాలి అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. కొన్ని పద్దుల చుట్టూ మాత్రమే తిరుగుతున్నారు.. దాదాపుగా రెండు కోట్ల మందికి కనీస వేతనం అందించాల్సి ఉంటుంది.. అంగన్వాడీలు, ఆశా వర్కర్ల, సింగరేణి, ఆర్టీసీ, వ్యవసాయ కూలీలు, పరిశ్రమల్లో పని చేసే కార్మికులు, లేబర్ డిపార్ట్మెంట్ లో పని చేసే వారు.. ఇలా ప్రతి ఒక్క విభాగంలో పని చేసే వారికి కనీస వేతనం ఉండేలా చూడాలన్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులపై పోరాడాల్సిందే.. అందరం కలిసి పోరాటం చేద్దాం.. అసలు అంశాలు చర్చకు రాకుండా తిట్టుకోవడం ఏంటి? అని ప్రశ్నించారు. అప్పులు చేశావు కాబట్టి నీదే బాధ్యత అంటే కుదరదు.. వాళ్ళ టైమ్ అయిపోయింది..ఇక మీరు ఏం చేస్తున్నారు.. దానిమీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. గతంలో కూడా చంద్రబాబు టూరిజంపై ప్రాధాన్యత ఇచ్చారు.. ఇప్పుడు ప్రభుత్వం టూరిజం పైనా దృష్టి పెట్టాలి.. ప్రాధాన్యత ఇవ్వండి అన్నాను.. కావాలని నా వాఖ్యలను వక్రీకరించారు.. అది మంచిది కాదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!