Jagga Reddy: రాహుల్ గాంధీని ప్రధాని చేసి ఉంటే.. మేమే ఐటీఐఆర్ తెచ్చే వాళ్ళం..!
- 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఐటీఐఆర్ ను రద్దు చేసింది..
- తెలంగాణ బీజేపీ ఎంపీలు ఐటీఐఆర్ ను రాష్ట్రానికి తీసుకు రావాలి..
- ఐటీఐఆర్ కోసం కిషన్ రెడ్డి.. బండి సంజయ్ లకు వినతి పత్నం ఇస్తా: జగ్గారెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఐటీఐఆర్ గురించి మాట్లాడిన.. యువతకు ఉద్యోగాల అంశం కాబట్టి మాట్లాడాను అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 2014 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చి దాన్ని రద్దు చేశారు.. వాస్తవం కాబట్టి మాట్లాడినా, అవగాహన లేకుండా.. అనాలోచితంగా కూడా మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. మోడీ రద్దు చేయకపోయి ఉంటే పదేళ్ళలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవి.. ఆధారాలతోనే నేను మాట్లాడిన.. ఇప్పుడు ఆధారాలు కూడా చూపెడుతున్నాను.. రాజకీయ విమర్శ కాదు.. ప్రభుత్వం మీద విమర్శ చేయాలని చేస్తుంది కాదు అని జగ్గారెడ్డి తెలిపారు.
Read Also: Pranava Rudranush County: శామీర్పేట లేక్కు దగ్గరగా.. ప్రకృతి ఒడిలో ‘రుద్రాన్ష్ కౌంటీ’
Also Read
- CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
- KTR: 'రాజ్యమా ఉలిక్కిపడు'.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
- Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
- CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
ఇక, ఐటీఐఆర్ మళ్ళీ తీసుకుని రావాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ అనుకుని ఉన్న నాలుగు ఎంపీ సీట్లను బీజేపీకే ఇచ్చారు ప్రజలు.. రఘునందన్ రావు.. మీకు ప్రజలు బాధ్యత ఇచ్చారు కాబట్టి అడుగుతున్నాం.. రాహుల్ గాంధీని ప్రధాని చేసి ఉంటే.. మేమే ఐటీఐఆర్ తెచ్చే వాళ్ళం అని పేర్కొన్నారు. మేము ప్రతిపక్ష పార్టీగా ఐటీఐఆర్ కావాలని అడుగుతున్నాం.. మంజూరు చేయించి మీరే క్రెడిట్ తీసుకోండి.. పార్లమెంట్ సమావేశాలు అయిపోయాక.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని కలిసి వినతి పత్రం అందిస్తామన్నారు. రద్దైన ఐటీఐఆర్ మళ్ళీ తెండి అని అడుగుతా.. సెప్టెంబర్ లో ఐటీఐఆర్ అనుమతి వచ్చింది.. ఐటీ ఏర్పాటుకు 50 వేల ఎకరాల్లో పెడితే.. 60 లక్షల ఉద్యోగాలు వచ్చేవి అని అంచనా వేశారు.. కానీ, 2016 ఏప్రిల్ లో మోడీ ప్రభుత్వం ఐటీఐఆర్ పక్కన పెట్టింది.. ఇప్పటికైనా, 8 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఐటీఐఆర్ తేవాలి అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఐదు రోజులకు ఒకసారి దీని మీద మాట్లాడతా.. రూలింగ్ పార్టీకి గుర్తు చేయడమే మా బాధ్యత కాబట్టి గుర్తు చేస్తున్నామని జగ్గారెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Tollywood Stars: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు.. షూటింగ్లో గాయపడిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
-
UK: లండన్లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
-
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!