CM Revanth Reddy: ఈరోజు తప్పితే దసరా వరకు కుదరదట.. భూమి పూజపై రేవంత్ కీలక వ్యాఖ్యలు..
- పది సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి తెలంగాణ తల్లి విగ్రహం..
- ఈరోజు తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని పండితులు..
- వేద పండితుల సలహా మేరకు ఈరోజు ప్రారంభించాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఈరోజు తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని, పండితులు తెలిపారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసుకోవడం మంచి పరిణామం అన్నారు. పది సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి తెలంగాణ తల్లి విగ్రహం గురైందన్నారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని భావించామన్నారు. వేద పండితుల సలహా మేరకు ఈరోజు ప్రారంభించామన్నారు. ఈరోజు తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని పండితులు తెలిపారు. సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కనిదంటూ ఏది లేదని.. తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారన్నారు. సోనియాగాంధీ మాట శిలా శాసనం అని తెలిపారు. 2014 ,24 వరకు ఎన్నోన్నో నిర్మించామని చెప్పారన్నారు. పది సంవత్సరాలు పరిపాలన చేసిన వారు తెలంగాణ తల్లిని మరుగున పడేశారన్నారు. అన్నీ నేనే అని చెప్పారన్నారు. ప్రగతి భవన్ పేరుతో గడిని నిర్మించుకుని.. పోలీసులను పహారగా పెట్టారన్నారు. తెలంగాణ ప్రజలను ప్రగతి భవన్ లోకి రాకుండా దూరం పెట్టారని తెలిపారు.
Read also: Constables Suspended: లంచాలు, యువతులతో ఖాకీల రాసలీలు.. సస్పెండ్ చేసిన హైదరాబాద్ సీపీ
Also Read
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
ప్రభుత్వ పాలనకు గుండెకాయ సచివాలయం అన్నారు. నాటి మంత్రులు ప్రజలకు అందుబాటులో లేరన్నారు. ఇరవై రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కానీ తెలంగాణ తల్లి విగ్రహం కోసం మహా అయితే కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి మనుసు రాలేదు నాటి ప్రభుత్వానికన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం లేక పోవడం లోటుగా భావించమన్నారు. మేధావుల సూచనల మేరకు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టామని తెలిపారు. కొందరు తమ కోసం సెక్రటేరియట్ ముందు స్థలం ఏర్పాటు పెట్టుకున్నారన్నారు. జూన్ 2న చెప్పిన.. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పామని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎమ్ కోరుకుంటూ నారో జేఎన్టియు ఫైన్ ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ కు తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించే భాద్యత ఇచ్చామన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైన రోజు డిసెంబర్ 9, సోనియాగాంధీ జన్మదినోత్సవమని.. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పండుగ రోజన్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, ఈ అవకాశం నాకు రావడం నా అదృష్టం అన్నారు.
Hyderabad Crime: నర్సుపై డాక్టర్ అసభ్య ప్రవర్తన.. కారులో ఎక్కించుకుని..
తాజావార్తలు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!