Dr K Laxman: ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే..
- ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే..
- బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr K Laxman: ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధ్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవంను జరుపుకోవడం ఇది మూడో సారి అన్నారు. అప్పటి ఉదంతాలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం అని తెలిపారు. నిజాం హైదరాబాద్ సంస్థానం నీ భారత్ లో విలీనం చేయను అంటే… ప్రజలు తిరుగుబాటు చేశారని తెలిపారు. నిజాం రజాకార్లు ప్రజల మీద దాస్టికాలకి పాల్పడ్డారన్నారు. చివరకి ప్రజల పోరాటానికి నిజాం తల ఒగ్గక తప్పలేదన్నారు. 1948 సెప్టెంబర్ 17 న విముక్తి లభించిందన్నారు. ఆ స్వతంత్ర దినాన్ని ఇక్కడ జరుపుకోలేని పరిస్థితి అని తెలిపారు. మజ్లిస్ , ఎంఐఎం ఒత్తిడితో తెలంగాణ విమోచన దినోత్సవంను ప్రభుత్వం జరపడం లేదని మండిపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటకలో విమోచన దినం జరుపుకుంటుంటే ఇక్కడ మాత్రం జరుపుకోవడం లేదన్నారు. మజ్లిస్ కు ఇబ్బంది కలుగకుండా గత సీఎం సెప్టెంబర్ 17 ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించారని తెలిపారు. కుహనా మేధావులు, కమ్యూనిస్టులు తెలంగాణ విద్రోహ దినం అంటున్నారని అన్నారు.
Read also: Cabinet Meeting: ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం.. హైడ్రాపై చర్చ..
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
హైదరాబాద్ దేశంలో విలీనం అయిన తర్వాత కూడా కమ్యూనిస్టులు ఎందుకు పోరాటం చేశారో చెప్పాలన్నారు. మిలటరీతో యుద్ధం దేని కోసం చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డి.. కూని రాగాలు తీయడం కాదు… విమోచనం అనే పదం ఎందుకు వాడడం లేదని ప్రశ్నించారు. మొక్కుబడి కోసం ప్రజాపాలన దినోత్సవం జరుపుతున్నారని తెలిపారు. అయినా దాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవం కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించామన్నారు. సీఎం రామని సమాచారం ఇచ్చారన్నారు. మజ్లిస్ ఒత్తిడి కి తలొగ్గి అయన రావడం లేదని తెలిపారు. వారి మెప్పుకోసం పని చేస్తే తెలంగాణ ప్రజలు సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన ఉద్యమాన్ని అవమానించడమే అని అన్నారు. ప్రజా పాలన దినోత్సవం కాదు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని తెలిపారు. ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాకుండా ముఖం చాటేయ్యడానికే కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి ఆహ్వానించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Okra Water: బెండ నీటితో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..
తాజావార్తలు
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!