Dr K Laxman: ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే..
- ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే..
- బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr K Laxman: ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధ్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవంను జరుపుకోవడం ఇది మూడో సారి అన్నారు. అప్పటి ఉదంతాలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం అని తెలిపారు. నిజాం హైదరాబాద్ సంస్థానం నీ భారత్ లో విలీనం చేయను అంటే… ప్రజలు తిరుగుబాటు చేశారని తెలిపారు. నిజాం రజాకార్లు ప్రజల మీద దాస్టికాలకి పాల్పడ్డారన్నారు. చివరకి ప్రజల పోరాటానికి నిజాం తల ఒగ్గక తప్పలేదన్నారు. 1948 సెప్టెంబర్ 17 న విముక్తి లభించిందన్నారు. ఆ స్వతంత్ర దినాన్ని ఇక్కడ జరుపుకోలేని పరిస్థితి అని తెలిపారు. మజ్లిస్ , ఎంఐఎం ఒత్తిడితో తెలంగాణ విమోచన దినోత్సవంను ప్రభుత్వం జరపడం లేదని మండిపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటకలో విమోచన దినం జరుపుకుంటుంటే ఇక్కడ మాత్రం జరుపుకోవడం లేదన్నారు. మజ్లిస్ కు ఇబ్బంది కలుగకుండా గత సీఎం సెప్టెంబర్ 17 ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించారని తెలిపారు. కుహనా మేధావులు, కమ్యూనిస్టులు తెలంగాణ విద్రోహ దినం అంటున్నారని అన్నారు.
Read also: Cabinet Meeting: ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం.. హైడ్రాపై చర్చ..
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
హైదరాబాద్ దేశంలో విలీనం అయిన తర్వాత కూడా కమ్యూనిస్టులు ఎందుకు పోరాటం చేశారో చెప్పాలన్నారు. మిలటరీతో యుద్ధం దేని కోసం చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డి.. కూని రాగాలు తీయడం కాదు… విమోచనం అనే పదం ఎందుకు వాడడం లేదని ప్రశ్నించారు. మొక్కుబడి కోసం ప్రజాపాలన దినోత్సవం జరుపుతున్నారని తెలిపారు. అయినా దాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవం కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించామన్నారు. సీఎం రామని సమాచారం ఇచ్చారన్నారు. మజ్లిస్ ఒత్తిడి కి తలొగ్గి అయన రావడం లేదని తెలిపారు. వారి మెప్పుకోసం పని చేస్తే తెలంగాణ ప్రజలు సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన ఉద్యమాన్ని అవమానించడమే అని అన్నారు. ప్రజా పాలన దినోత్సవం కాదు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని తెలిపారు. ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాకుండా ముఖం చాటేయ్యడానికే కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి ఆహ్వానించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Okra Water: బెండ నీటితో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!