Dr K Laxman: ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే..
- ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే..
- బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr K Laxman: ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధ్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవంను జరుపుకోవడం ఇది మూడో సారి అన్నారు. అప్పటి ఉదంతాలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం అని తెలిపారు. నిజాం హైదరాబాద్ సంస్థానం నీ భారత్ లో విలీనం చేయను అంటే… ప్రజలు తిరుగుబాటు చేశారని తెలిపారు. నిజాం రజాకార్లు ప్రజల మీద దాస్టికాలకి పాల్పడ్డారన్నారు. చివరకి ప్రజల పోరాటానికి నిజాం తల ఒగ్గక తప్పలేదన్నారు. 1948 సెప్టెంబర్ 17 న విముక్తి లభించిందన్నారు. ఆ స్వతంత్ర దినాన్ని ఇక్కడ జరుపుకోలేని పరిస్థితి అని తెలిపారు. మజ్లిస్ , ఎంఐఎం ఒత్తిడితో తెలంగాణ విమోచన దినోత్సవంను ప్రభుత్వం జరపడం లేదని మండిపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటకలో విమోచన దినం జరుపుకుంటుంటే ఇక్కడ మాత్రం జరుపుకోవడం లేదన్నారు. మజ్లిస్ కు ఇబ్బంది కలుగకుండా గత సీఎం సెప్టెంబర్ 17 ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించారని తెలిపారు. కుహనా మేధావులు, కమ్యూనిస్టులు తెలంగాణ విద్రోహ దినం అంటున్నారని అన్నారు.
Read also: Cabinet Meeting: ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం.. హైడ్రాపై చర్చ..
Also Read
హైదరాబాద్ దేశంలో విలీనం అయిన తర్వాత కూడా కమ్యూనిస్టులు ఎందుకు పోరాటం చేశారో చెప్పాలన్నారు. మిలటరీతో యుద్ధం దేని కోసం చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డి.. కూని రాగాలు తీయడం కాదు… విమోచనం అనే పదం ఎందుకు వాడడం లేదని ప్రశ్నించారు. మొక్కుబడి కోసం ప్రజాపాలన దినోత్సవం జరుపుతున్నారని తెలిపారు. అయినా దాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవం కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించామన్నారు. సీఎం రామని సమాచారం ఇచ్చారన్నారు. మజ్లిస్ ఒత్తిడి కి తలొగ్గి అయన రావడం లేదని తెలిపారు. వారి మెప్పుకోసం పని చేస్తే తెలంగాణ ప్రజలు సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన ఉద్యమాన్ని అవమానించడమే అని అన్నారు. ప్రజా పాలన దినోత్సవం కాదు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని తెలిపారు. ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాకుండా ముఖం చాటేయ్యడానికే కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి ఆహ్వానించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Okra Water: బెండ నీటితో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!