Alleti Maheshwar Reddy: బడ్జెట్ను చూస్తుంటే.. ఆదాయం చరానా.. అప్పులు బరానా అన్నట్లు ఉంది..
- ఈ బడ్జెట్ చూస్తుంటే హామీలను ఎగవేసేలా ఉంది..
- రాష్ట్రాన్ని దివాలా తీసేలా కాంగ్రెస్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది..
- ఆదాయం చరానా.. అప్పులు బరానా అన్నట్లు ఉంది: మహేశ్వర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alleti Maheshwar Reddy: ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూస్తే హామీల ఎగవేతల బడ్జెట్ లా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇది మొండి చేయి ఇచ్చే బడ్జెట్.. గొప్పలు చెప్పుకొనే బడ్జెట్.. కేవలం 36 వేల కోట్లతో అభివృద్ధి ఎలా సాధ్యమో భట్టి విక్రమార్క చెప్పాలన్నారు. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేలా పెట్టారు బడ్జెట్ అని మండిపడ్డారు. ఆదాయం చరానా.. అప్పు బరానా అన్నట్లు ఉంది.. బడ్జెట్ నిండా అప్పులే ఉన్నాయి.. రాష్ట్ర అప్పులు మరింత పెరిగే సూచికగా ఉంది.. ఇన్ని రకాలుగా అప్పులు చేసిన ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఈ సారి కూడా నిరుద్యోగులకు మొండి చేయి చూపిస్తారని అర్థం అయ్యింది.. మహిళలకు ఇస్తామన్న హామీలు ఎందుకు పొందు పర్చలేదో చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: MLC Kavitha: బడ్జెట్లో ప్రవచనాలు ఎక్కువ.. పైసలు తక్కువ
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- Rail Parcel App: గుడ్న్యూస్.. అందుబాటులోకి రైల్వే పార్సిల్ యాప్.. ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
- CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
ఇక, రైతు భరోసాకి నిధులు ఏ రకంగా సరిపోతాయనేది చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడిగారు. వ్యవసాయ కూలీలకు బడ్జెట్ కేటాయించకపోవడం బాదకరం అన్నారు. రైతులను మోసం చేసేలా ఉంది ఈ బడ్జెట్.. రైతులకు ఇచ్చిన హామీలు 42 వేల కోట్లు అవసరం.. ఆది ఎక్కడా బడ్జెట్ లో పెట్టకపోవడం చూస్తే.. మరోసారి రైతులను మోసం చేయబోతున్నారని అర్థం అవుతుంది.. బీసీ సబ్ ప్లాన్ ప్రకారం బడ్జెట్ ప్రవేశ పెట్టకపోవడం ఎలా అని ప్రశ్నిస్తున్నాం..
మైనారిటీలతో పోల్చుకుంటే 16 వేల కోట్లు బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది.. కానీ, 11 వేల కోట్లు మాత్రమే కేటాయించారు.. అంటే మైనారిటీలపై ఉన్న ప్రేమ బీసీల మీద లేదా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
Read Also: Delhi: ఢిల్లీలో దారుణం.. బట్టల వ్యాపారి దంపతుల హత్య.. కేర్ టేకర్పై అనుమానాలు
అయితే, బీసీలపై మీ చిత్త శుద్ధి ఏంటని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడిగారు. హామీలన్నీ ఎగవేసి తెలంగాణ ప్రజలను మోసం చేసే బడ్జెట్ లా ఉంది.. హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.. ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్లు అని బడ్జెట్ లో పెట్టారు.. గత బడ్జెట్ లో కూడా 3500 ఇండ్లు అన్నారు ఇవ్వలేదు.. గత బడ్జెట్ లో తప్పు చేశామని ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు. మోసం చేయడానికే బడ్జెట్ ప్రవేశ పెట్టారు.. మరొసారి ప్రజలను మోసం చేయడానికే ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
తాజావార్తలు
-
Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో
-
Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
-
US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
-
Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
Mamata Banerjee: “మాజీ సీఎం కాదు”.. మమతా ఎక్స్ బయోలో పొలిటికల్ మెసేజ్..