Delhi: ఢిల్లీలో దారుణం.. బట్టల వ్యాపారి దంపతుల హత్య.. కేర్ టేకర్పై అనుమానాలు
- ఢిల్లీలో దారుణం
- బట్టల వ్యాపారి దంపతుల హత్య
- కేర్ టేకర్పై అనుమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రెడీమేడ్ దుస్తుల వ్యాపారి మోహిందర్ సింగ్, అతని భార్య దిల్జీత్ కౌర్ దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఇంట్లో శవాలుగా పడి ఉన్నారు. దంపతుల నివాసానికి సమీపంలోనే ఇద్దరు కుమారులు, కుమార్తె నివాసం ఉంటుంది. అయితే గత మూడు రోజులుగా తల్లిదండ్రులను చూసేందుకు రాలేదు. అయితే డ్రైవర్ చూసేసరికి చనిపోయి ఉన్నారు. సమాచారం పిల్లలకు చేరవేయడంతో డబుల్ మర్డర్ వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: MLC Kavitha: బడ్జెట్లో ప్రవచనాలు ఎక్కువ.. పైసలు తక్కువ
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. గొంతుకోసి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే కేర్టేకర్ పాత్రపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులు క్రితమే కొత్తగా కేర్ టేకర్ జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం అతడు కనిపించకుండా పోయాడు. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. భర్తను గొంతుకోసి చంపగా… భార్యను ఇనుపరాడ్తో కొట్టినట్లు పోలీసులు తెలిపారు.
రవి అనే వ్యక్తి కేర్టేకర్గా ఉంటున్నాడు. అయితే ఆరోగ్యం బాగోలేదని సెలవు అడిగాడు. రవి సెలవు అడిగి తన స్థానంలో మరొక వ్యక్తిని నియమించి వెళ్లాడు. అయితే వృద్ధ దంపతులు రవి నియమించిన వ్యక్తిని అంగీకరించారు. అయితే ఇంట్లో లాకర్ పగులగొట్టే ప్రయత్నం చేసినట్లుగా ఆనవాళ్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: కుల మతాలతో సంబంధం లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో విద్యాభ్యాసం..
వృద్ధ దంపతుల ఇంటి సమీపంలోనే ముగ్గురు పిల్లలు నివాసం ఉంటున్నారు. కానీ మూడు రోజులుగా ఇటువైపు రాలేదు. డ్రైవర్ చెప్పాకే ఈ విషయం తెలిసిందని కుమారుడు చరణ్ప్రీత్ సింగ్ తెలిపాడు. డ్రైవర్ ఇంటి బెల్ మోగిస్తే… ఎవరూ స్పందించలేదని చెప్పాడు. తండ్రి మృతదేహం ఒకచోట… తల్లి మృతదేహం మరొక చోట ఉందని తెలిపాడు. ఇక సీసీటీవీ ఫుటేజ్లో కేర్టేకర్ బ్యాక్ప్యాక్తో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ బ్యాగ్లో ఏమున్నాయో తెలియదన్నాడు. మొహిందర్ సింగ్ చివరిసారిగా ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సజీవంగా కనిపించారు. దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు సమాచారం ఇచ్చారని ఒక పోలీస్ అధికారి తెలిపారు. చనిపోయి రెండు, మూడు రోజులు అయి ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అలాగే పరారీలో ఉన్న రవిని కూడా పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Delhi: పార్లమెంట్ను సందర్శించిన బిల్గేట్స్
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!