Shavarma: షవర్మా తిని 17 మందికి తీవ్ర అస్వస్థత.. అల్వాల్ గ్రిల్ హౌజ్ బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shavarma: హైదరాబాద్లోని అల్వాల్లో షవర్మా తిని 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట నలుగురు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు, ఐదు రోజుల్లో బాధితుల సంఖ్య 17 కి చేరుకుంది. బొల్లార్కు చెందిన భవిక్ రెడ్డి, మున్నా శనివారం మధ్యాహ్నం ఇద్దరు యువతులతో కలిసి షావర్మా తిన్నారు. ఇంటికి వెళ్లిన అరగంటకే వాంతులు, విరేచనాలు అయ్యాయి. అస్వస్థతకు గురికావడంతో బాధితులు ఒక్కొక్కరుగా ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. వారు వాంతులు, విరేచనాలు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం కంటోన్మెంట్ జనరల్ ఆస్పత్రిలో 13 మంది, ప్రవేటు ఆస్పత్రిలో నలుగురు చికిత్స పొందుతున్నారు. బాధితుల రక్త పరీక్షల్లో హానికరమైన సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారి బీ లక్ష్మీకాంత్ ధృవీకరించారు. మయోనైస్ వల్లనే తాము అస్వస్థతకు గురయ్యామని చెప్పారు. షావర్మా, కబాబ్లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లలో సాధారణంగా ఉపయోగించే మయోనైస్, మసాలాల వాడకం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయినట్లు తెలుస్తుంది.
Read also: Extra Ordinary Man OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Also Read
గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనెతో తయారు చేసిన మయోనైజ్ తయారీ సమయంలో పరిశుభ్రత, ప్రమాణాలు పాటించకపోతే ప్రమాదకరమని తెలిపారు. అన్ని ప్రమాణాలు సిద్ధం చేసిన మయోన్నైస్ నాలుగు గంటల్లో వినియోగించబడాలని హెచ్చరిస్తుంది. నిల్వ ఉంచి వినియోగిస్తే రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. షావర్మాతో పాటు మయోనైస్ కూడా తీసుకోవడం వల్ల చాలా మంది ఆసుపత్రుల్లో చేరినట్లు జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. అలా జరగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం వహించే హోటల్ యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రిల్ హౌస్ మేనేజర్ తౌఫిక్ను అరెస్టు చేసినట్లు అల్వాల్ ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్ వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 273, 269 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Extra Ordinary Man OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!