Cyber Crime : భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను ఛేదించిన పోలీసులు
- ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ విజయవంతం
- 9 రాష్ట్రాల్లో దాడులు.. 52 మంది అరెస్ట్
- బ్యాంకు అధికారుల కుమ్మక్కు బహిర్గతం
- రూ.150 కోట్ల సైబర్ మోసాల వెలికితీత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ పేరుతో చేపట్టిన ఈ భారీ ఆపరేషన్లో భాగంగా 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన పోలీసులు, 32 మంది బ్యాంకు అధికారులతో సహా మొత్తం 52 మంది నిందితులను కటకటాల్లోకి నెట్టారు. ప్రధానంగా పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ మోసాలు, మరియు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో అమాయకులను బెదిరించి దోచుకుంటున్న ముఠాలకు అండగా నిలుస్తున్న బ్యాంకు అధికారులే లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కైన కొందరు బ్యాంకు అధికారులు, కేవైసీ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా సుమారు 350 ‘మ్యూల్ ఖాతాలను’ తెరిచి ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 850 కేసులతో సంబంధం ఉన్న రూ. 150 కోట్ల మేర భారీ సొమ్ము దారిమళ్ళినట్లు పోలీసులు గుర్తించారు.
Jammu Kashmir: శ్రీనగర్ ఎయిర్పోర్టులో ఇద్దరు అమెరికా పౌరుల అరెస్ట్..
Also Read
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి. అరవింద్ బాబు, ఏసీపీ ఆర్.జి. శివ మారుతి నేతృత్వంలోని 16 ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు నిరంతరం శ్రమించి ఈ నెట్వర్క్ను తుదముట్టించాయి. ఈ దాడుల్లో ఐడీఎఫ్సీ, ఇండస్ఇండ్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రముఖ బ్యాంకులకు చెందిన మేనేజర్లు, కేవైసీ అప్రూవర్లు అరెస్ట్ కావడం గమనార్హం. నిందితుల నుంచి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు మరియు 21 షెల్ కంపెనీల స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అధికారులు కేవలం తమ లాభాల కోసం లేదా నిర్లక్ష్యం వల్ల నేరగాళ్లకు సహకరిస్తున్నారని, ఇది వ్యవస్థకు పెద్ద ముప్పుగా మారిందని అధికారులు స్పష్టం చేశారు.
Viral : పంది కడుపున ‘ఏనుగు పిల్ల’.. విస్తుపోతున్న జనం.!
ఈ భారీ విజయంపై హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్ గారు మాట్లాడుతూ, సైబర్ నేరాల కట్టడిలో తాము ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తున్నామని, చట్టాన్ని అతిక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు కేవైసీ నిబంధనల విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజలు కూడా అధిక లాభాల పేరుతో వచ్చే ప్రకటనలను నమ్మి మోసపోవద్దని, డిజిటల్ అరెస్టుల వంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ‘1930’ నంబర్కు ఫిర్యాదు చేసి తమ సొమ్మును కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!