HYD : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జంట జలాశయాలను మరోసారి నింపేశాయి. ముఖ్యంగా వికారాబాద్, తాండూర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వరద పోటెత్తింది. దీంతో ఇన్ఫ్లో భారీగా పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం (ఫుల్ ట్యాంక్ లెవెల్) 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1789.30 అడుగుల వరకు చేరింది. జలాశయానికి గంట గంటకూ వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం 1500 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, అధికారులు నాలుగు గేట్లు 3 అడుగుల మేర ఎత్తి 1352 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
CP Radhakrishnan: నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం.. ఎన్డీఏ నేతల హాజరు
హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1763.15 అడుగులకు చేరింది. ఈ జలాశయానికి 5000 క్యూసెక్కుల వరద వస్తుండగా, అధికారులు రెండు గేట్లు నాలుగు అడుగుల మేర, మరో గేటు ఒక అడుగు మేర ఎత్తి మొత్తం 3600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. వరద ఉదృతి ఎక్కువగా కొనసాగుతుండటంతో అధికారులు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు గేట్లను మరింతగా తెరిచి నీటి విడుదలను పెంచనున్నారు. ఉస్మాన్ సాగర్ నుండి 2400 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ నుండి 5600 క్యూసెక్కుల నీటిని ఒకేసారి వదిలే అవకాశం ఉందని సమాచారం.
ఈ నీరు మూసీ నదిలోకి చేరడంతో మరోసారి మూసి ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉంది. జలాశయాలు నిండిపోవడం వల్ల హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నా, మూసి పరివాహక ప్రాంతాల్లో నివసించే వారికి అధికారులు అప్రమత్తం చేశారు. వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు అందిస్తున్నారు.
Vijayawada: అప్పటి నుంచే దేవి నవరాత్రులు ప్రారంభం.. ఏ రోజున ఏ అలంకారంలో దర్శనం ఇవ్వబోతున్నారంటే!