Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Hyderabad New Electric Buses 65 Tsrtc

Electric Buses : రేపు హైదరాబాద్ రోడ్లపైకి 65 ఎలక్ట్రిక్ బస్సులు

Published Date :December 9, 2025 , 9:04 pm
By Gogikar Sai Krishna
  • రేపు హైదరాబాద్ రోడ్లపైకి 65 ఎలక్ట్రిక్ బస్సులు
  • రాణిగంజ్ డిపోలో ప్రారంభించనున్న టీజీఎస్ ఆర్టీసీ
  • హాజరుకానున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్
  • బస్సులను ఆపరేట్ చేయనున్న ఈవీట్రాన్స్..
Electric Buses : రేపు హైదరాబాద్ రోడ్లపైకి 65 ఎలక్ట్రిక్ బస్సులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి, వాతావరణ కాలుష్యానికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రజారవాణాను మరింత సౌకర్యవంతంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే దిశగా నగరంలో కొత్తగా 65 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకురానుంది. ఈ నిర్ణయంతో ప్రయాణికుల అసౌకర్యం తగ్గడంతో పాటు, కాలుష్య నియంత్రణకు కూడా తోడ్పడనుంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభ కార్యక్రమం బుధవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ బస్సులను ఈవీట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేయనుండగా, నిర్వహణ బాధ్యతలను కూడా అదే సంస్థ చేపట్టనుంది.

Also Read

  • Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
  • Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..
  • Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
  • Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ

ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, రద్దీ తగ్గించేందుకు ఆర్టీసీ విడతల వారీగా కొత్త బస్సులను ప్రవేశపెడుతోంది. తాజా విడతలో భాగంగా తీసుకొస్తున్న 65 ఎలక్ట్రిక్ బస్సులు నగర ప్రజారవాణా వ్యవస్థకు మరింత బలం చేకూర్చనున్నాయి.

IndiGo Flight Cuts: ఇండిగోకు కేంద్రం గట్టి షాక్‌.. 10% విమాన సర్వీసులు కట్ చేస్తూ ఆర్డర్!

ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా డీజిల్ వాహనాలతో పోలిస్తే కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. నగరంలో వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో, పర్యావరణహిత ప్రజారవాణా విధానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇదిలా ఉండగా, రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో గ్రీన్ ఎనర్జీపై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2030 నాటికి హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని వెల్లడించారు. అలాగే 2047 నాటికి గ్రీన్ ఎనర్జీ ఆధారిత రవాణా విధానంతో ముందుకు సాగుతామని తెలిపారు.

హైదరాబాద్‌లో జనాభా అధికంగా ఉండటం వల్ల వాతావరణ కాలుష్యం కూడా వేగంగా పెరుగుతోందని, ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజారవాణాను మరింత ఆధునికంగా, ప్రజలకు అనుకూలంగా మార్చడమే లక్ష్యంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.

Sudan War: సూడాన్ రక్తపాతం.. ఆ ముస్లిం దేశం యువరాజులపై తీవ్రమైన ఆరోపణలు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Electric Public Transport
  • green energy
  • hyderabad Electric buses
  • Telangana Transport
  • TSRTC

తాజావార్తలు

  • Jio Rs 209 Plan: జియో యూజర్స్‌కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?

  • Egg Biryani Recipe: 10 నిమిషాల్లోనే కుక్కర్ లో ఎగ్ బిర్యానీ.. ఇలా చేస్తే టెస్ట్ అదుర్స్..!

  • Vinesh Phogat: బ్రిజ్ భూషణ్‌ బాధితుల్లో నేను కూడా ఒకరిని.. మౌనం వీడి రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన ప్రకటన!

  • AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..

  • SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై పాట్ కమిన్స్ తీవ్ర ఆవేదన.. దాని వల్లనే ఓడిపోయామంటూ..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions