Hyderabad Metro Rail New Record: గణేష్ నిమజ్జనం వేళ.. మెట్రో నయా రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత… ట్రాఫిక్ కష్టాలు తగ్గాయని చెబుతారు.. ఇక, ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో.. మెట్రో రైల్ సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.. లక్షలాది మంది హైదరాబాదీలు మెట్రోను వినియోగించుకుంటున్నారు.. దీంతో.. హైదరాబాద్ మెట్రో తాజాగా సరికొత్త రికార్డు సృష్టించింది… ఒకేరోజు 4 లక్షల మంది ప్రయాణం చేయడంతో.. ఈ తాజా రికార్డును అందుకుంది హైదరాబాద్ మెట్రో రైల్.. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవ సమయం పొడిగించినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే కాగా… అందుకు అనుగుణంగా.. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి (శనివారం) అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులను నడిపారు. గణేష్ నిమజ్జనం రోజున ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్రోరైలు సమయాన్ని పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది… ఇక, మెట్రో రైలులో ఒకే రోజు 4 లక్షల మంది ప్రయాణం చేయడంతో.. కొత్త రికార్డు నెలక్పొంది..
Read Also: Cheating Case: టీడీపీ అధికార ప్రతినిధిపై హైదరాబాద్లో కేసు.. రూ.20 వేలు తీసుకొని ఇలా..!
Also Read
- Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
- TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
- OTR: టీఆర్ఎస్ పేరు చుట్టూ కొత్త వివాదాలు..తెలంగాణ రక్షణసేన పేరుకు ఈసీ బ్రేక్స్
- OTR: ఉమ్మడి నల్గొండ పరిధిలోకి అడుగుపెట్టని బీఆర్ఎస్ అగ్రనేతలు...అసలు కారణాలేంటి ?
ఒక్క మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్లోనే 2.46 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సర్వీసులను ఉపయోగించుకోగా… నాగోల్-రాయదుర్గం మార్గంలో 1.49 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేశారు.. ఇక, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్లో 22 వేల మంది ప్రయాణo చేశారని.. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రకటించింది… అత్యధికంగా ఖైరతాబాద్ స్టేషన్లో 22 వేల మంది రైలు ఎక్కగా, 40 వేల మంది రైలు దిగినట్టు పేర్కొంది.. కాగా, గణేష్ నిమజ్జనం రోజు ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా.. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రత్యేకంగా సమయం పొడిగించి మెట్రో సర్వీసులను నడిపింది.. శుక్రవారం ఉదయం 6 గంటల.. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులు తిరిగాయి.. చివరి మెట్రో రైలు సెప్టెంబర్ 10న ఒంటిగంటకు బయలుదేరి దాదాపు రెండు గంటల సమయంలో సంబంధిత స్టేషన్లకు చేరుకుంది.. ఇక, ఇవాళ తిరిగి ఉదయం ఆరుగంటల నుంచి మెట్రో సేవలు యథావిథిగా నడుస్తున్న విషయం తెలిసిందే. మొత్తంగా వినాయకుడి ఎఫెక్ట్తో.. హైదరాబాద్ మెట్రో కొత్త రికార్డు సృష్టించింది.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!