Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
- మెట్రో పిల్లర్ క్రాక్ అంటూ వస్తున్న వార్తలను ఖండించిన HYD మెట్రో
- ప్రమాద స్థలానికి పిల్లర్ దగ్గరగా ఉంది
- అందుకే మెట్రో పిల్లర్ను చెక్ చేశాం
- మెట్రో పిల్లర్కు ఎలాంటి డ్యామేజీ జరగలేదు
- ప్రకటన బోర్డు కాలి.. దాని లిక్విడ్ పిల్లర్పై పడింది. -మెట్రో అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ameerpet Fire Accident : అమీర్పేట్ అగ్నిప్రమాదం నేపథ్యంలో మెట్రో పిల్లర్కు పగుళ్లు (క్రాక్స్) వచ్చాయంటూ సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలపై హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు స్పందించారు. ఈ వార్తలను వారు పూర్తిగా ఖండించారు. మెట్రో పిల్లర్కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదం జరిగిన వ్యాపార సముదాయానికి మెట్రో పిల్లర్ చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రమాదం కారణంగా పిల్లర్కు ఏమైనా నష్టం జరిగిందా అని నిర్ధారించుకోవడానికి మాత్రమే ముందస్తు జాగ్రత్తగా నిపుణులతో తనిఖీలు చేయించామన్నారు.
ప్రకటన బోర్డు కాలి.. దాని లిక్విడ్ పిల్లర్పై పడింది..
ఈ తనిఖీల్లో మెట్రో పిల్లర్ నిర్మాణానికి ఎలాంటి డ్యామేజీ జరగలేదని, అది పూర్తిగా సురక్షితంగానే ఉందని తేలింది. (Ameerpet Fire Accident) పిల్లర్ పై ఉన్న ఒక ప్రకటన బోర్డు (Ad Board) మంటలకు కాలిపోవడంతో, దానికి సంబంధించిన కెమికల్ లిక్విడ్ కారుతూ వచ్చి మెట్రో పిల్లర్పై పడింది. ఆ లిక్విడ్ మరకల వల్ల పిల్లర్పై పగుళ్లు వచ్చినట్లు బయటకు కనిపించిందే తప్ప, వాస్తవానికి పిల్లర్కు ఎలాంటి క్రాక్స్ రాలేదని అధికారులు వివరణ ఇచ్చారు. మెట్రో సర్వీసులు ఎప్పటిలాగే పూర్తి సురక్షితంగా నడుస్తాయని, పుకార్లను నమ్మవద్దని మెట్రో అధికారులు కోరారు.
Also Read
- CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
తాజావార్తలు
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!