Three State CMs: ఇవాళ హైదరాబాద్కు మూడు రాష్ట్రాల సీఎంలు.. స్వాగతం పలకనున్న తెలంగాణ మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Three State CMs: కేరళ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు హైదరాబాద్ రానున్నారు. జనవరి 18న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంతన్ ఖమ్మం పాల్గొననున్నారు.యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. వీరంతా రేపు ఉదయం సీఎం కేసీఆర్తో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి వెళ్లనున్నారు. స్వామివారి దర్శనానంతరం అందరూ ఖమ్మం సభకు బయలుదేరారు. ఖమ్మంలో తొలి బీఆర్ఎస్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభను రహస్యంగా నిర్వహించనున్నారు. బహిరంగ సభలో ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తుమ్మల నాగేశ్వర్ ఇప్పటికే పరిశీలించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఇవాళ హైదరాబాద్ చేరుకోనున్నారు. దాంతో 400 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ సమావేశంలో వెయ్యి మంది వాలంటీర్లను నియమించారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ షెడ్యూల్..
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఇవాళ రాత్రికి జాతీయ నేతలంతా హైదరాబాద్కు చేరుకుంటారు.
* యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకుతారు.
* ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కి మంత్రి మహమూద్ అలీ స్వాగతం చెబుతారు. ప్రొటోకాల్ చూస్తారు.
* కేరళ సీఎం పినరయి విజయన్ కి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి,
* సీపీఐ జాతీయనేత డి.రాజాకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ స్వాగతం స్వాగతం పలుకుతారు.
రేపు 18.1.23 ఉదయం జాతీయ నేతలంతా సీఎం కేసీఆర్ గారితో బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు.
* ఆ తర్వాత సీఎం కేసీఆర్ తో కలిసి వారంతా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
* యాదాద్రి నుంచి రెండు హెలీకాప్టర్లలో ఖమ్మంకు బయలుదేరుతారు.
* నేరుగా సీఎం కేసీఆర్ తో కలిసి వారంతా ఖమ్మం కలెక్టరేట్ చేరుకొని, రాష్రంరులో చేపట్టే రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
* ఖమ్మం సభా వేదిక ముందు ప్రధాన నాయకులకు ప్రత్యేక సెక్టార్ ఉంటుంది.
* మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు సభావేదిక ముందు ఆసీనులవుతారు.
* సీఎం కేసీఆర్ తో సభా వేదికపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలే ఉంటారు.
* 18వ తేదీ మ. 2 నుంచి సా. 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది.
Master Plan: నేడు మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం… ఉద్యమం ఉదృతంపై చర్చ
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!