Three State CMs: ఇవాళ హైదరాబాద్కు మూడు రాష్ట్రాల సీఎంలు.. స్వాగతం పలకనున్న తెలంగాణ మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Three State CMs: కేరళ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు హైదరాబాద్ రానున్నారు. జనవరి 18న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంతన్ ఖమ్మం పాల్గొననున్నారు.యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. వీరంతా రేపు ఉదయం సీఎం కేసీఆర్తో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి వెళ్లనున్నారు. స్వామివారి దర్శనానంతరం అందరూ ఖమ్మం సభకు బయలుదేరారు. ఖమ్మంలో తొలి బీఆర్ఎస్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభను రహస్యంగా నిర్వహించనున్నారు. బహిరంగ సభలో ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తుమ్మల నాగేశ్వర్ ఇప్పటికే పరిశీలించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఇవాళ హైదరాబాద్ చేరుకోనున్నారు. దాంతో 400 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ సమావేశంలో వెయ్యి మంది వాలంటీర్లను నియమించారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ షెడ్యూల్..
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
ఇవాళ రాత్రికి జాతీయ నేతలంతా హైదరాబాద్కు చేరుకుంటారు.
* యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకుతారు.
* ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కి మంత్రి మహమూద్ అలీ స్వాగతం చెబుతారు. ప్రొటోకాల్ చూస్తారు.
* కేరళ సీఎం పినరయి విజయన్ కి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి,
* సీపీఐ జాతీయనేత డి.రాజాకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ స్వాగతం స్వాగతం పలుకుతారు.
రేపు 18.1.23 ఉదయం జాతీయ నేతలంతా సీఎం కేసీఆర్ గారితో బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు.
* ఆ తర్వాత సీఎం కేసీఆర్ తో కలిసి వారంతా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
* యాదాద్రి నుంచి రెండు హెలీకాప్టర్లలో ఖమ్మంకు బయలుదేరుతారు.
* నేరుగా సీఎం కేసీఆర్ తో కలిసి వారంతా ఖమ్మం కలెక్టరేట్ చేరుకొని, రాష్రంరులో చేపట్టే రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
* ఖమ్మం సభా వేదిక ముందు ప్రధాన నాయకులకు ప్రత్యేక సెక్టార్ ఉంటుంది.
* మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు సభావేదిక ముందు ఆసీనులవుతారు.
* సీఎం కేసీఆర్ తో సభా వేదికపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలే ఉంటారు.
* 18వ తేదీ మ. 2 నుంచి సా. 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది.
Master Plan: నేడు మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం… ఉద్యమం ఉదృతంపై చర్చ
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!