Hyderabad Crime: అద్దె కారులో రెక్కీ.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: జల్సాలకు అలవాటుపడి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు మాట్లాడుతూ.. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి దాదాపు 36 తులాల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలతో పాటు ల్యాప్టాప్, కారు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ముఠా (దోపిడీ గ్యాంగ్) చోరీలకు పాల్పడినట్లు ఏసీపీ రాములు వివరించారు. నేరేడ్మెట్ ప్రాంతానికి చెందిన బండ విజయకుమార్ (28) ఇంటీరియర్ వర్క్తో పాటు పెయింటర్గా పనిచేస్తున్నాడు. కుషాయిగూడ ప్రాంతంలో నివసించే కృష్ణవంశీ(26) ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అల్వాల్ ప్రాంతానికి చెందిన మరో నిందితుడు సతీష్ (30) కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రధాన నిందితుడు విజయకుమార్, కృష్ణవంశీ, సతీష్లు నాలుగు నెలల క్రితం పరిచయమయ్యారు. అప్పటి నుంచి డ్రగ్స్, జల్సాలకు బానిసలయ్యారు. ఈ పథకం ప్రకారం కారు అద్దెకు తీసుకుని చోరీకి పాల్పడాలని నిర్ణయించుకున్నారు.
Read also: TRAI : ఇప్పుడు ప్రతి కాల్ కి సంబంధించిన కాలర్ పేరు తెలవాల్సిందే
Also Read
- Ponnam Prabhakar: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి యువత పోరాట విజయం
- NIMS Hyderabad : నిమ్స్లో వైద్య రంగానికి మైలురాయి.. 2 గంటల్లోనే బ్రెయిన్ సర్జరీలు
- Jagtial: జగిత్యాలలో విషజ్వరాల కలకలం.. రెండు రోజుల్లో ఇద్దరు చిన్నారులు మృతి
- CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
గతంలో అమెజాన్లో పనిచేసిన కృష్ణవంశీ అనే ఇంటీరియరిస్ట్ వివిధ ప్రాంతాలకు చెందిన కాలనీపై పూర్తి పట్టు ఉండడంతో పథకం ప్రకారం దొంగతనాలు చేసేవాడు. దొంగతనం చేయాలనుకున్న ఇంటి నుంచి కారును అద్దెకు తీసుకుని దూరంగా ఉంచి… ముందుగా రెక్కీ ప్రకారం తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని మరో ఇద్దరు డోర్ కట్టర్ తో తాళాలు తెరిచి చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. . కుషాయిగూడ, చర్లపల్లి, జవానగర్ అల్వాల్ ప్రాంతాల్లోని ఆరు ఇళ్లలో చోరీలు చేశారు. ఈ నెల 21న అల్వాల్ పట్టణ పరిధిలోని మచ్చ బొల్లారం ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు… అనుమానాస్పద స్థితిలో కారులో ప్రయాణిస్తున్న విజయ్కుమార్, కృష్ణవంశీ సతీష్లను అదుపులోకి తీసుకుని విచారించగా ముఠా దొంగతనాలు బయటపడ్డాయని ఏసీపీ రాములు వివరించారు. కాంతి. సుమారు 32 తులాల బంగారు ఆభరణాలు, 4 కిలోల వెండి ఆభరణాలు, కారుతోపాటు ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. వీరి ముఠాలోని మరో ఇద్దరు నిందితులు తేజ, సుధాకర్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్ ఆధ్వర్యంలో డీసీపీ నరసింహ ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ కేసు దర్యాప్తు చేపట్టారు.
JP Nadda: నేడు అన్ని రాష్ట్రాల బీజేపీ ఇన్చార్జ్లు, కో-ఇన్చార్జ్లతో జేపీ నడ్డా సమావేశం..
తాజావార్తలు
-
Prakash Raj: “కాక్రోచెస్ ప్రభుత్వాన్ని మోకాళ్లపైకి తెచ్చారు!” : ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
-
Sonam Wangchuk: ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం’’.. కేంద్రమంత్రి రాజీనామాపై సోనమ్ వాంగ్చుక్..
-
Ponnam Prabhakar: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి యువత పోరాట విజయం
-
NIMS Hyderabad : నిమ్స్లో వైద్య రంగానికి మైలురాయి.. 2 గంటల్లోనే బ్రెయిన్ సర్జరీలు
-
CJP: ‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’.. ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ..
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!