Hyderabad Crime: అద్దె కారులో రెక్కీ.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: జల్సాలకు అలవాటుపడి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు మాట్లాడుతూ.. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి దాదాపు 36 తులాల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలతో పాటు ల్యాప్టాప్, కారు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ముఠా (దోపిడీ గ్యాంగ్) చోరీలకు పాల్పడినట్లు ఏసీపీ రాములు వివరించారు. నేరేడ్మెట్ ప్రాంతానికి చెందిన బండ విజయకుమార్ (28) ఇంటీరియర్ వర్క్తో పాటు పెయింటర్గా పనిచేస్తున్నాడు. కుషాయిగూడ ప్రాంతంలో నివసించే కృష్ణవంశీ(26) ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అల్వాల్ ప్రాంతానికి చెందిన మరో నిందితుడు సతీష్ (30) కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రధాన నిందితుడు విజయకుమార్, కృష్ణవంశీ, సతీష్లు నాలుగు నెలల క్రితం పరిచయమయ్యారు. అప్పటి నుంచి డ్రగ్స్, జల్సాలకు బానిసలయ్యారు. ఈ పథకం ప్రకారం కారు అద్దెకు తీసుకుని చోరీకి పాల్పడాలని నిర్ణయించుకున్నారు.
Read also: TRAI : ఇప్పుడు ప్రతి కాల్ కి సంబంధించిన కాలర్ పేరు తెలవాల్సిందే
Also Read
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
గతంలో అమెజాన్లో పనిచేసిన కృష్ణవంశీ అనే ఇంటీరియరిస్ట్ వివిధ ప్రాంతాలకు చెందిన కాలనీపై పూర్తి పట్టు ఉండడంతో పథకం ప్రకారం దొంగతనాలు చేసేవాడు. దొంగతనం చేయాలనుకున్న ఇంటి నుంచి కారును అద్దెకు తీసుకుని దూరంగా ఉంచి… ముందుగా రెక్కీ ప్రకారం తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని మరో ఇద్దరు డోర్ కట్టర్ తో తాళాలు తెరిచి చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. . కుషాయిగూడ, చర్లపల్లి, జవానగర్ అల్వాల్ ప్రాంతాల్లోని ఆరు ఇళ్లలో చోరీలు చేశారు. ఈ నెల 21న అల్వాల్ పట్టణ పరిధిలోని మచ్చ బొల్లారం ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు… అనుమానాస్పద స్థితిలో కారులో ప్రయాణిస్తున్న విజయ్కుమార్, కృష్ణవంశీ సతీష్లను అదుపులోకి తీసుకుని విచారించగా ముఠా దొంగతనాలు బయటపడ్డాయని ఏసీపీ రాములు వివరించారు. కాంతి. సుమారు 32 తులాల బంగారు ఆభరణాలు, 4 కిలోల వెండి ఆభరణాలు, కారుతోపాటు ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. వీరి ముఠాలోని మరో ఇద్దరు నిందితులు తేజ, సుధాకర్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్ ఆధ్వర్యంలో డీసీపీ నరసింహ ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ కేసు దర్యాప్తు చేపట్టారు.
JP Nadda: నేడు అన్ని రాష్ట్రాల బీజేపీ ఇన్చార్జ్లు, కో-ఇన్చార్జ్లతో జేపీ నడ్డా సమావేశం..
తాజావార్తలు
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!