Husband Killed Wife: ‘ఫోన్’ పెట్టిన చిచ్చు.. భార్యని కాల్వలో తోసేసి హత్య చేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Killed His Wife By Throwing Her Into The Canal For Using Phone Regularly In Jagityal District: ఈమధ్య ప్రతి ఒక్కరి జీవితంలో ‘మొబైల్ ఫోన్’ అనేది అనివార్యమైపోయింది. చాలామంది తమ కుటుంబ సభ్యుల కన్నా, ఫోన్తోనే ఎక్కువసేపు గడుపుతున్నారంటే.. ఏ స్థాయిలో దానికి అందరూ అడిక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. తిండి లేకపోయినా బ్రతకగలమేమో గానీ, ఫోన్ లేకపోతే మాత్రం ఉండలేమన్న పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. అఫ్కోర్స్.. ఈ మొబైల్ ఫోన్ వల్ల చాలామంది అవసరాలైతే తీరుతున్నాయి కానీ, చాలామంది కేవలం కాలక్షేపం కోసమే దీనిని వినియోగిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. మితిమీరి వాడుతున్న వారి జీవితాల్లో.. ఈ మొబైల్ ఫోన్ చిచ్చు పెడుతోంది. పచ్చని కాపురాల్లో చిచ్చు కూడా పెడుతోంది. ఇప్పుడు తాజాగా ఓ కాపురం కూడా ఈ ఫోన్ వల్లే కూలిపోయింది. తన భార్య ఫోన్ వాడటాన్ని సహించలేకపోయిన భర్త.. ఆమెని వరద కాల్వలో పడేసి హత్య చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Etela Rajender: మా మధ్య ఎలాంటి గ్యాపులు లేవు.. ఈటల క్లారిటీ
Also Read
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల!
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన జామీర్తో పది నెలల క్రితం కోరుట్లకు చెందిన సాజిదతో వివాహం అయ్యింది. వీరి సంసార జీవితం మొదట్లో సాఫీగానే సాగింది. కొన్నాళ్లు ఎలాంటి గొడవలు లేకుండా.. అన్యోన్యంగా తమ దాంపత్య జీవితాన్ని గడిపారు. అయితే.. కొన్ని నెలల గడిచాక జామీర్, సాజిదల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇందుకు కారణం.. సాజిద తరచూ ఫోన్లో మాట్లాడటమే! గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుండటంతో.. భార్యపై జామీర్ అనుమానం పెంచుకున్నాడు. తాను తన బంధవులతోనే ఫోన్లో మాట్లాడుతానని చెప్పినా.. జామీర్ అనుమానం తీరలేదు. దీంతో.. అతడు తన భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. భూషణ్రావు పేట్ వరద కాల్వ వద్దకు తన భార్యను మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. కాలువ దగ్గరికి వెళ్లిన వెంటనే.. సాజిదని తోసేసి, హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సాజిద కుటుంబ సభ్యులు.. జామీర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
-
Murder Case: ‘నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు’.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
-
Chandrababu: ‘అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్’.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
-
Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
-
Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?