Summer Effect: భానుడి భగభగలు.. 43.8 డిగ్రీలు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సూరీడు చుర్రుమంటున్నాడు. సాధారణంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండ వేడిమి పెరుగుతుంది. కానీ ఈసారి ఒక నెలముందుగానే ఎండలు పెరిగిపోయాయి. దీంతో బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతున్నాయి. కొమురం భీం జిల్లా కెరమెరిలో 43.9 గా గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా వాంకిడిలో 43.8 గా నమోదు అయ్యాయి.
అలాగే ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ లో 43.2 గా నమోదయ్యాయి. బోరాజ్ లో 43 డిగ్రీలు కాగా .బేలా మండలం చేప్రాలలో 42.7 గా నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో 42.7 గా నమోదు కాగా మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 42.1 గా గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటినప్పటినుంచీ ఎండల తీవ్రత పెరుగుతోంది.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
తెలంగాణలో అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. మే నెలలో ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది. ఎండలు పెరుగుతుండడంతో చిన్న పిల్లలు, వృద్ధులు ఎండలకు బయటకు వెళ్లకుండా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బతో పాటు డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంతగా ఎక్కువగా నీటిని తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!