Cheddi Gang: అమ్మో మళ్లీ వచ్చారు.. మహబూబ్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cheddi Gang: తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్చల్ చేసింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చెడ్డి గ్యాంగ్ భయాందోళనకు గురిచేశారు. బృందావన్ కాలనిలో వరుస దొంగ తనాలకు పాల్పడుతూ ప్రజలను హడలెత్తిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఓ ఇంట్లో భారీగా నగదు, బంగారం దోపిడీ చేశారు. గతంలో కూడా అదే కాలనిలో చోరీకి చెడ్డి గ్యాంగ్ విఫలయత్నం కావడంతో వెనుతిరిగారు. రాత్రి పూట ఇళ్లలో చాకచక్యంగా చొరబడి డబ్బులు, నగలు దొంగతాలకు పాల్పడుతుండటంతో మహబూబ్ నగర్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటికి తాళం వేయాలంటేనే జంకుగుతున్నరు. దీనిపై బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగ తనానికి వచ్చిన చెడ్డి గ్యాంగ్ వీడియో లు సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి.
గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సంగారెడ్డి,రంగా రెడ్డి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచరించడం కలకలం రేపింది. మీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో 12 తులాల బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. కాగా.. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ సంచరించడం కలకలం రేపింది. పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న మై హోం వెంచర్లో ఓ ఇంటి సమీపంలో నలుగురు సభ్యులు ఉన్న ముఠా చేతిలో మారణ ఆయుధాలతో సంచరించడం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారు చెడ్డి గ్యాంగ్ ల ఉండడంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పుడు మళ్లీ మహబూబ్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేస్తుండటంతో.. బాబోయ్ మళ్లీ వచ్చారంటూ ప్రజలు భయాందోళకు గురవుతున్నారు.
వరుస దొంగతనాలు..
జనవరి 15 జగిత్యాల జిల్లా
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని తండ్రియాల బ్రాంచ్ ఏటీఎమ్ లో భారీ చోరీకి పాల్పడ్డారు దుండుగులు. అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఏటీఎం పగలగొట్టి సుమారు 19 లక్షల వరకు దుండగులు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కూతవేటులోనే ఉన్న ఏటీఎం సెంటర్ లో జరగడం కలకలం రేపింది. ముందస్తు ప్లాన్ వేసుకున్నా దుండగులు సీసీ కెమెరాలను మూసివేసేసి చోరీకి పాల్పడ్డారు. అర్థరాత్రి కావడంతో వారి పని సులువుగా కానించారు. మెల్లగా బయటకు పరారవుదామనుకునే లోపే అక్కడున్న స్థానికులు వారిని గమనించి పోట్రోలింగ్ పోలీసుకుల సమాచారం ఇచ్చారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు సినిమా స్టైల్లో దుండగులను ఛేజ్ చేసి అదుపులో తీసుకున్నారు.
జనవరి 13 న ఎల్బినగర్
తాజాగా.. ఎల్బినగర్లో చైన్ స్నాచర్లు తెగబడ్డారు. బ్యాగును భుజాన వేసుకుని వెళుతున్న 50ఏళ్ల వృద్ధురాలిని టార్గెట్ చేశారు. వారి ఎదురుగా వెళుతూ తన మెడలో గొలుసు వుందని గమనించారు. కారు పక్కన బైక్ ఆపి ఆమె మెడలో వున్న బంగారం గొలుసును తెంచుకుని అక్కడ నుంచి పరారయ్యాడు. ఆమె అరిచినా ప్రయోజనం లేకుండా పోయింది. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. రెండు తులాల బంగారం గొలుసు తెంపుకెళ్లారని వాపోయింది. ఎల్.బి. నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫోటేజ్ ఆధారంతో దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జనవరి 8 సైబరాబాద్ కమీష్నరేట్ పరిధిలో
సైబరాబాద్ కమీష్నరేట్ పరిధిలో వరస చైన్ స్నాచర్ లు హల్ చల్ చేసి గంట వ్యవధిలో 6 చోట్ల చైన్ స్నాచింగ్ కి పాల్పడిన ఘటన నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గంటల వ్యవధిలో 6 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు గల్లీలో రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. సికింద్రాబాద్ రాంగోపాల్పేట్, ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పరిధిలో స్నాచింగ్ హడలెత్తిస్తున్నాయి. గంటలోనే ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ లలో చైన్ స్నాచింగ్ జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నడుచుకుంటూ వెళ్తున్నవారిని టార్గెట్ చేస్తూ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా చైన్ స్నాచింగ్ చేస్తూ కళ్లుమూసి తెరిచేలోగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. వరుస చైన్ స్నాచింగ్ లతో పోలీసులకు సవాల్ గా మారింది.
Manikrao Thakur: నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో థాక్రే పర్యటన
తాజావార్తలు
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?