Ramappa Temple: అధిక వర్షాలు.. రామప్పకు ముప్పురానుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారం రోజులుగా కురుస్తున్న వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో రహదాలు స్తంబించాయి. భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ముప్పును ఎదుర్కొంటోంది. కురుస్తున్న భారీ వర్షాలతో ఆలయం చుట్టూ వరద నీరు వచ్చి చేరుతోంది. ఈనేపథ్యంలో.. మురుగు కాల్వలోకి సాఫీగా నీరు వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో.. ఆలయ ప్రాంగణంలోనే వర్షపు నీరు నిలిచిపోతోంది.
అయితే.. రామప్ప దేవాలయం.. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక కట్టడం. కాకతీయులు మేధోసంపత్తిని, గజ, అశ్వ, సైనిక బలాలను ఉపయోగించి ఇసుక దిబ్బపై ఎంతో నేర్పు, పరిజ్ఞానంతో నిర్మించిన రాతి కట్టడం అధిక వర్షాలతో ముప్పును ఎదుర్కొంటోంది. కాగా.. పురావస్తుశాఖ నిర్లక్ష్యం కారణంగా ఏటా వర్షాకాలంలో ఏదో ఒక సమస్య తలెత్తుతోంది. ఈనేపథ్యంలో.. ఇటీవల ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రామప్ప ఆలయం చుట్టూ వరదనీరు చేరుతోంది. ఆలయం నలుమూలలా మురుగుకాల్వల్లో పూడిక మట్టి చేరింది. ఆలయంలోని ఉపాలయాల పరిస్థితి మరీ దారుణంగా తారైంది. వర్షాల కారనంగా వచ్చే వరదనీటిని ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
Also Read
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
గతంలో ఇలా…
2020లో ఆలయం ఈశాన్యభాగంలోని ప్రహరీ వర్షాలకు కూలింది. ఇప్పటికీ మరమ్మతులు చేపట్టలేదు.* 2017లో ఆలయానికి వెళ్లే మార్గంలో.. ప్రస్తుత పార్కింగ్ స్థలానికి దగ్గరలోని శివాలయం కూడా కూలిపోయింది. దీనిని పునరుద్ధరించలేదు. అయితే.. 2015లో నీరు లీకవుతున్న ప్రాంతాలను గుర్తించి పైభాగంలోని ఒక పొరను పూర్తిగా తొలగించారు. కొత్తగా మళ్లీ శ్లాబ్ వేసినా ఫలితం లేకపోయింది.* 2014లో ఆలయంలోని మరో 4చోట్ల నీరు కారడం మొదలైంది. దాన్ని అరికట్టడం కోసం పురావస్తుశాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు చేశారు. పనులు నామమాత్రంగా చేయడంతో సమస్య మళ్లీ ఉత్పన్నమైంది.
2013లో ఆలయంలోని ఈశాన్యభాగంలో చిన్నగా నీరు కారడం మొదలైంది. దాంతో అప్పుడప్పుడు పెచ్చులూడుతున్నాయి.ఇవీ చేయాల్సిన పనులు.. రామప్ప పర్యవేక్షణకు ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాలి. ఆలయ పరిధిలోని పురావస్తు శాఖ అధికారులు సైతం నిత్యం రామప్పలో ఉండి విధులు నిర్వర్తించేలా చూడాలని స్థానికులు చెబుతున్నారు. అధికారులు చొరవ తీసుకుని ఆలయం నలుమూలలా మురుగు కాల్వలను నిర్మించారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పూడిక లేకుండా చేసి వర్షపు నీరు సాఫీగా బయటకు వెళ్లేలా చూడాలి, రామప్ప ఆలయ ప్రాంగణంలో నీటి గుంతలు లేకుండా చూడాలని, పడిన ప్రతి వర్షపు చుక్కా బయటకు వెళ్లేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!