Heat Waves: ఎండలేదని ఎంజాయ్ చేస్తున్నారా.. ముందుంది ముసళ్ల పండగ
Heat Waves: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎండలు బండులు పగిలే మండుతున్న సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో 45 డిగ్రీలు ఉంటుంది. వేసవి కాలంలో అడపాదడపా వర్షాలు కురిసినా ఎండలు మండిపోతున్నాయి. కానీ ఈసారి వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. భానుడు భగభగ మండుతున్న సమయంలో వరుణుడు కుండపోత వర్షాలు కురిపిస్తున్నాడు. వాతావరణం పూర్తిగా చల్లబడి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి వర్షాకాలంగా మారిపోయింది. ఇది వర్షాకాలమా? ఇది వేసవి కాలమా? అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది.
కాగా.. రానున్న రోజుల్లో భానుడు మళ్లీ తన ప్రతాపం చూపించనున్నాడు. మే 8 నుంచి ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నా.. మళ్లీ భానుడు తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడని అంటున్నారు. మే 8 నుంచి రాష్ట్రంలో తీవ్ర వేడి గాలులు వీస్తాయని.. వర్షాలు పూర్తిగా ఆగిపోయాయని, ప్రతి రోజూ వేడిగాలులు వీస్తాయని చెబుతున్నారు. ప్రతి ఏడాది వేసవి మాదిరిగానే ఈ ఏడాది కూడా మే 8 తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడిస్తున్నారు.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
- Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
Read also: Rangareddy Crime: కన్న బిడ్డను అమ్మింది.. సంచిలో శవమైంది
అయితే చల్లటి వేసవి త్వరలో వేడి వేసవిగా మారుతుందని తెలిసి చాలా మంది నిరాశ చెందగా, మరికొందరు వర్షాల కంటే ఎండలు మంచివని అంటున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారని.. ఈ సమయంలో కురుస్తున్న వర్షాల కంటే ఎండలు బాగానే ఉన్నాయని అంటున్నారు. వర్షాకాలంలోనే వర్షాలు కురిస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ వారం చివరి వరకు వర్షాలు..
మరోవైపు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వారం చివరి వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అంచనా. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలతో పాటు భారీ ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇవాళ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్.. రేపటి నుంచి 7 వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Ilayaraja : ఇళయరాజా ఇంట్లో విషాదం..
తాజావార్తలు
-
Astrology: మే 2 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!