HCA : హెచ్సీఏ కుంభకోణం కేసులో కీలక మలుపు.. ఐదుగురు నిందితులు సీఐడీ కస్టడీలోకి
- నకిలీ పత్రాలతో క్లబ్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రావు
- హెచ్సీఏ నిధుల దుర్వినియోగంపై సీఐడీ లోతైన దర్యాప్తు
- మల్కాజ్గిరి కోర్టు ఆరుగురు నిందితులకు ఆరు రోజుల కస్టడీ అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆర్థిక అవకతవకల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురిని సీఐడీ అధికారులు ఈ రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు. మల్కాజ్గిరి కోర్టు ఆరుగురికి కస్టడీ అనుమతి ఇవ్వడంతో, ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను సీఐడీ జూలై 21 వరకు అదుపులో ఉంచనుంది.
కస్టడీకి అనుమతి లభించిన వారిలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈవో సునీల్, ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత యాదవ్, సెక్రటరీ రాజేందర్ యాదవ్ ఉన్నారు. వీరిపై హెచ్సీఏ క్లబ్లలో జరిగిన అవకతవకలు, గత ఎన్నికల్లో చోటు చేసుకున్న అనుమానాస్పద పరిణామాలపై సీఐడీ అధికారులు లోతుగా విచారించనున్నారు.
Also Read
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యం.. సింగరేణి నుంచే ఆపరేషన్ మొదలు?
- Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- Shiv Charan Reddy: 'నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు'.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
Virat Kohli: ‘కింగ్’ కోహ్లీ ఆల్టైమ్ రికార్డ్.. మరో ఆటగాడికి సాధ్యం కాదేమో?
నిందితుల బెయిల్ పిటిషన్లను ఇటీవలే కోర్టు తిరస్కరించింది. విచారణ వేగవంతం కావలసిన అవసరం ఉందని కోర్టు సూచించింది. గురువారం ఉదయం నుంచి సీఐడీ కస్టడీలో దర్యాప్తు కొనసాగనుంది.
ఇదిలా ఉండగా, నకిలీ పత్రాలతో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ను ఏర్పాటు చేసి హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికలకు పోటీ చేసినట్లు జగన్మోహన్రావుపై ఆరోపణలు వచ్చాయి. గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు సీ. కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు సీఐడీ ఆధారాలు సేకరించింది.
నిధుల దుర్వినియోగంపై, అక్రమ లావాదేవీలపై సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. కోర్టు అనుమతితో సంబంధిత ఆర్థిక రికార్డులు, సాక్ష్యాలను సేకరించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది.
ఒకప్పుడు దేశానికి గొప్ప క్రికెటర్లను అందించిన హెచ్సీఏ… ఇప్పుడు అవినీతి ఆరోపణలతో దేశ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటోంది. బీసీసీఐ నుంచి వస్తున్న నిధులు నిర్వాహకుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయని, క్రికెట్ అభివృద్ధి గాలికొదిలేశారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జరిగిన అరెస్టులతో పాటు, కస్టడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Air India: B-787 విమానాల తనిఖీ పూర్తి.. ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్ల్లో ఎలాంటి లోపం లేదన్న ఎయిర్ ఇండియా
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!