HCA : హెచ్సీఏ కుంభకోణం కేసులో కీలక మలుపు.. ఐదుగురు నిందితులు సీఐడీ కస్టడీలోకి
- నకిలీ పత్రాలతో క్లబ్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రావు
- హెచ్సీఏ నిధుల దుర్వినియోగంపై సీఐడీ లోతైన దర్యాప్తు
- మల్కాజ్గిరి కోర్టు ఆరుగురు నిందితులకు ఆరు రోజుల కస్టడీ అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆర్థిక అవకతవకల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురిని సీఐడీ అధికారులు ఈ రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు. మల్కాజ్గిరి కోర్టు ఆరుగురికి కస్టడీ అనుమతి ఇవ్వడంతో, ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను సీఐడీ జూలై 21 వరకు అదుపులో ఉంచనుంది.
కస్టడీకి అనుమతి లభించిన వారిలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈవో సునీల్, ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత యాదవ్, సెక్రటరీ రాజేందర్ యాదవ్ ఉన్నారు. వీరిపై హెచ్సీఏ క్లబ్లలో జరిగిన అవకతవకలు, గత ఎన్నికల్లో చోటు చేసుకున్న అనుమానాస్పద పరిణామాలపై సీఐడీ అధికారులు లోతుగా విచారించనున్నారు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
Virat Kohli: ‘కింగ్’ కోహ్లీ ఆల్టైమ్ రికార్డ్.. మరో ఆటగాడికి సాధ్యం కాదేమో?
నిందితుల బెయిల్ పిటిషన్లను ఇటీవలే కోర్టు తిరస్కరించింది. విచారణ వేగవంతం కావలసిన అవసరం ఉందని కోర్టు సూచించింది. గురువారం ఉదయం నుంచి సీఐడీ కస్టడీలో దర్యాప్తు కొనసాగనుంది.
ఇదిలా ఉండగా, నకిలీ పత్రాలతో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ను ఏర్పాటు చేసి హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికలకు పోటీ చేసినట్లు జగన్మోహన్రావుపై ఆరోపణలు వచ్చాయి. గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు సీ. కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు సీఐడీ ఆధారాలు సేకరించింది.
నిధుల దుర్వినియోగంపై, అక్రమ లావాదేవీలపై సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. కోర్టు అనుమతితో సంబంధిత ఆర్థిక రికార్డులు, సాక్ష్యాలను సేకరించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది.
ఒకప్పుడు దేశానికి గొప్ప క్రికెటర్లను అందించిన హెచ్సీఏ… ఇప్పుడు అవినీతి ఆరోపణలతో దేశ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటోంది. బీసీసీఐ నుంచి వస్తున్న నిధులు నిర్వాహకుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయని, క్రికెట్ అభివృద్ధి గాలికొదిలేశారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జరిగిన అరెస్టులతో పాటు, కస్టడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Air India: B-787 విమానాల తనిఖీ పూర్తి.. ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్ల్లో ఎలాంటి లోపం లేదన్న ఎయిర్ ఇండియా
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!