HCA : హెచ్సీఏ కుంభకోణం కేసులో కీలక మలుపు.. ఐదుగురు నిందితులు సీఐడీ కస్టడీలోకి
- నకిలీ పత్రాలతో క్లబ్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రావు
- హెచ్సీఏ నిధుల దుర్వినియోగంపై సీఐడీ లోతైన దర్యాప్తు
- మల్కాజ్గిరి కోర్టు ఆరుగురు నిందితులకు ఆరు రోజుల కస్టడీ అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆర్థిక అవకతవకల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురిని సీఐడీ అధికారులు ఈ రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు. మల్కాజ్గిరి కోర్టు ఆరుగురికి కస్టడీ అనుమతి ఇవ్వడంతో, ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను సీఐడీ జూలై 21 వరకు అదుపులో ఉంచనుంది.
కస్టడీకి అనుమతి లభించిన వారిలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈవో సునీల్, ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత యాదవ్, సెక్రటరీ రాజేందర్ యాదవ్ ఉన్నారు. వీరిపై హెచ్సీఏ క్లబ్లలో జరిగిన అవకతవకలు, గత ఎన్నికల్లో చోటు చేసుకున్న అనుమానాస్పద పరిణామాలపై సీఐడీ అధికారులు లోతుగా విచారించనున్నారు.
Also Read
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
Virat Kohli: ‘కింగ్’ కోహ్లీ ఆల్టైమ్ రికార్డ్.. మరో ఆటగాడికి సాధ్యం కాదేమో?
నిందితుల బెయిల్ పిటిషన్లను ఇటీవలే కోర్టు తిరస్కరించింది. విచారణ వేగవంతం కావలసిన అవసరం ఉందని కోర్టు సూచించింది. గురువారం ఉదయం నుంచి సీఐడీ కస్టడీలో దర్యాప్తు కొనసాగనుంది.
ఇదిలా ఉండగా, నకిలీ పత్రాలతో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ను ఏర్పాటు చేసి హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికలకు పోటీ చేసినట్లు జగన్మోహన్రావుపై ఆరోపణలు వచ్చాయి. గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు సీ. కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు సీఐడీ ఆధారాలు సేకరించింది.
నిధుల దుర్వినియోగంపై, అక్రమ లావాదేవీలపై సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. కోర్టు అనుమతితో సంబంధిత ఆర్థిక రికార్డులు, సాక్ష్యాలను సేకరించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది.
ఒకప్పుడు దేశానికి గొప్ప క్రికెటర్లను అందించిన హెచ్సీఏ… ఇప్పుడు అవినీతి ఆరోపణలతో దేశ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటోంది. బీసీసీఐ నుంచి వస్తున్న నిధులు నిర్వాహకుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయని, క్రికెట్ అభివృద్ధి గాలికొదిలేశారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జరిగిన అరెస్టులతో పాటు, కస్టడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Air India: B-787 విమానాల తనిఖీ పూర్తి.. ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్ల్లో ఎలాంటి లోపం లేదన్న ఎయిర్ ఇండియా
తాజావార్తలు
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!