HCA : హెచ్సీఏ కుంభకోణం కేసులో కీలక మలుపు.. ఐదుగురు నిందితులు సీఐడీ కస్టడీలోకి
- నకిలీ పత్రాలతో క్లబ్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రావు
- హెచ్సీఏ నిధుల దుర్వినియోగంపై సీఐడీ లోతైన దర్యాప్తు
- మల్కాజ్గిరి కోర్టు ఆరుగురు నిందితులకు ఆరు రోజుల కస్టడీ అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆర్థిక అవకతవకల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురిని సీఐడీ అధికారులు ఈ రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు. మల్కాజ్గిరి కోర్టు ఆరుగురికి కస్టడీ అనుమతి ఇవ్వడంతో, ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను సీఐడీ జూలై 21 వరకు అదుపులో ఉంచనుంది.
కస్టడీకి అనుమతి లభించిన వారిలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈవో సునీల్, ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత యాదవ్, సెక్రటరీ రాజేందర్ యాదవ్ ఉన్నారు. వీరిపై హెచ్సీఏ క్లబ్లలో జరిగిన అవకతవకలు, గత ఎన్నికల్లో చోటు చేసుకున్న అనుమానాస్పద పరిణామాలపై సీఐడీ అధికారులు లోతుగా విచారించనున్నారు.
Also Read
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
Virat Kohli: ‘కింగ్’ కోహ్లీ ఆల్టైమ్ రికార్డ్.. మరో ఆటగాడికి సాధ్యం కాదేమో?
నిందితుల బెయిల్ పిటిషన్లను ఇటీవలే కోర్టు తిరస్కరించింది. విచారణ వేగవంతం కావలసిన అవసరం ఉందని కోర్టు సూచించింది. గురువారం ఉదయం నుంచి సీఐడీ కస్టడీలో దర్యాప్తు కొనసాగనుంది.
ఇదిలా ఉండగా, నకిలీ పత్రాలతో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ను ఏర్పాటు చేసి హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికలకు పోటీ చేసినట్లు జగన్మోహన్రావుపై ఆరోపణలు వచ్చాయి. గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు సీ. కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు సీఐడీ ఆధారాలు సేకరించింది.
నిధుల దుర్వినియోగంపై, అక్రమ లావాదేవీలపై సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. కోర్టు అనుమతితో సంబంధిత ఆర్థిక రికార్డులు, సాక్ష్యాలను సేకరించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది.
ఒకప్పుడు దేశానికి గొప్ప క్రికెటర్లను అందించిన హెచ్సీఏ… ఇప్పుడు అవినీతి ఆరోపణలతో దేశ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటోంది. బీసీసీఐ నుంచి వస్తున్న నిధులు నిర్వాహకుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయని, క్రికెట్ అభివృద్ధి గాలికొదిలేశారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జరిగిన అరెస్టులతో పాటు, కస్టడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Air India: B-787 విమానాల తనిఖీ పూర్తి.. ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్ల్లో ఎలాంటి లోపం లేదన్న ఎయిర్ ఇండియా
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్టైమ్ హిస్టరీ..
-
Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్పై కెప్టెన్ గిల్ రియాక్షన్
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
-
Gill Century Celebration: శుభ్మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..