Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..
- యూరియా అమ్మకాలపై ఆంక్షలు.. హరీష్ రావు ఫైర్
- రైతాంగం ఇబ్బందులు.. సరఫరా నిలిపివేతపై విమర్శలు
- ‘రైతు డిక్లరేషన్’ హామీలు విఫలం అంటూ ఆరోపణలు
- ఆంక్షలు ఎత్తివేయాలని ప్రభుత్వానికి డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటైన విమర్శలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై ఆంక్షలు విధించడం అత్యంత దిక్కుమాలిన చర్య అని హరీష్ రావు మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియాపై ఇలాంటి ఆంక్షలు విధించడం ప్రస్తుత ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఎరువుల ధరలు పెరగడం ఒకవైపు, యూరియా సరఫరా నిలిపివేయడం మరోవైపు రైతులను తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెరకు, పండ్ల తోటలు, కూరగాయలు పండించే రైతులు ఈ సరఫరా నిలిపివేతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
- Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
- Mulugu : ప్రాణాలతో చెలగాటం.. వర్షాకాలంలో వాగు దాటేందుకు ఆదివాసీల అవస్థలు.!
- ED: ఈడీ సంచలన చర్య.. తొలిసారి విమానం వేలం.. చాలా చీఫ్గా విక్రయం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ‘రైతు డిక్లరేషన్’ పేరిట అనేక హామీలను ఇచ్చిందని, అయితే వాటిని నెరవేర్చడంలో ఇప్పుడు పూర్తిగా విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. రైతుబంధు, పంటలకు బోనస్ చెల్లింపు, రుణమాఫీ, పంట భీమా వంటి కీలకమైన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన ఎద్దేవా చేశారు. రైతుల కష్టాలను తీర్చాల్సింది పోయి, సమస్యలను మరింత జటిలం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
యూరియా కొరతను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం, రైతులకు యూరియా వినియోగం తగ్గించాలని సూచించడం హాస్యాస్పదంగా ఉందని హరీష్ రావు విమర్శించారు. ఇటువంటి వింత సూచనలు చేయడం మానేసి, ప్రభుత్వం తక్షణమే ఈ అనాధికారిక నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మునుపటిలాగే ఎటువంటి ఆంక్షలు లేకుండా యూరియా అమ్మకాలను కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
తాజావార్తలు
-
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. 15 మంది మృతి
-
CM Chandrababu Naidu: ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించిన సీఎం.!
-
CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
-
Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
-
India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!