Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..
- యూరియా అమ్మకాలపై ఆంక్షలు.. హరీష్ రావు ఫైర్
- రైతాంగం ఇబ్బందులు.. సరఫరా నిలిపివేతపై విమర్శలు
- ‘రైతు డిక్లరేషన్’ హామీలు విఫలం అంటూ ఆరోపణలు
- ఆంక్షలు ఎత్తివేయాలని ప్రభుత్వానికి డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటైన విమర్శలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై ఆంక్షలు విధించడం అత్యంత దిక్కుమాలిన చర్య అని హరీష్ రావు మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియాపై ఇలాంటి ఆంక్షలు విధించడం ప్రస్తుత ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఎరువుల ధరలు పెరగడం ఒకవైపు, యూరియా సరఫరా నిలిపివేయడం మరోవైపు రైతులను తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెరకు, పండ్ల తోటలు, కూరగాయలు పండించే రైతులు ఈ సరఫరా నిలిపివేతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
Also Read
- IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
- Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
- SIR Phase-3 : దేశవ్యాప్తంగా 'SIR ఫేజ్-3' షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ‘రైతు డిక్లరేషన్’ పేరిట అనేక హామీలను ఇచ్చిందని, అయితే వాటిని నెరవేర్చడంలో ఇప్పుడు పూర్తిగా విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. రైతుబంధు, పంటలకు బోనస్ చెల్లింపు, రుణమాఫీ, పంట భీమా వంటి కీలకమైన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన ఎద్దేవా చేశారు. రైతుల కష్టాలను తీర్చాల్సింది పోయి, సమస్యలను మరింత జటిలం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
యూరియా కొరతను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం, రైతులకు యూరియా వినియోగం తగ్గించాలని సూచించడం హాస్యాస్పదంగా ఉందని హరీష్ రావు విమర్శించారు. ఇటువంటి వింత సూచనలు చేయడం మానేసి, ప్రభుత్వం తక్షణమే ఈ అనాధికారిక నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మునుపటిలాగే ఎటువంటి ఆంక్షలు లేకుండా యూరియా అమ్మకాలను కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
తాజావార్తలు
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!