Harish Rao: ఎల్నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
- ఎల్నినోపై ప్రభుత్వ వాదనకు హరీష్ రావు కౌంటర్
- శ్రీశైలం నీటి వినియోగంపై ఉత్తమ్కు సవాల్
- నీళ్లు ఉన్నా తోడుకోలేకపోతున్నారంటూ విమర్శ
- రైతులను ఆదుకోవడంపై ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ శాసనసభలో సాగునీరు, ఎల్ నినో పరిస్థితులపై జరిగిన చర్చపై బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ప్రకృతి తెచ్చిన కష్టం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చిన మానవ నిర్మిత కరువని ఆరోపించారు. కేసీఆర్తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బాధ్యతాయుతమైన నాయకుడిగా తాను ఈ విషయాలను ఆధారాలతో సహా నిరూపిస్తానని స్పష్టం చేశారు.
అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు.. మంత్రి ఉత్తమ్పై మండిపాటు
కృష్ణా జలాల వినియోగంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తప్పుడు గణాంకాలు చెప్పారని హరీష్ రావు విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ 80 టీఎంసీలకు పైగా నీటిని వాడుకుందని చెప్పడం శుద్ధ అబద్ధమని కొట్టిపారేశారు. శ్రీశైలం నుంచి నీటిని తోడేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఒక్కటే మార్గమని, అక్కడ కేవలం 8 టీఎంసీలు మాత్రమే ఎత్తినప్పుడు, మిగతా 80 టీఎంసీల నీళ్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. చేతనైతే ఆ నీళ్లను రైతుల పొలాల్లో ఎక్కడ వాడారో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
Also Read
- TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
- Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
చేతకానితనంతోనే నీటి సంక్షోభం
కృష్ణా నదిలో తెలంగాణ వాటాను సరిగ్గా వాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. శ్రీశైలంలో సరిపడా నీళ్లు ఉన్నప్పటికీ, కల్వకుర్తి వద్ద ఐదు మోటార్లకు గాను కేవలం రెండు మోటార్లను మాత్రమే నడుపుతున్నారని మండిపడ్డారు. నీళ్లు ఉన్నా తోడుకోలేని చేతకానితనంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, తమ వైఫల్యాన్ని ఎల్ నినో , ప్రకృతిపై తోసివేసి చేతులు దులుపుకోవాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
రైతుల సమస్యలను వదిలి రాజకీయ కుట్రలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత తక్కువ పరిమాణంలో నీటి వినియోగం జరగడం ఇదే తొలిసారి అని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాలపై దాడులు చేయడం, రాజకీయ కుట్రలు పన్నడంపైనే దృష్టి పెడుతోందే తప్ప, ఎండిపోతున్న పంటలకు, అల్లాడుతున్న రైతులకు నీళ్లందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Harish Rao: ఎల్నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!