Harish Rao : రాష్ట్రంలో నిర్బంధ పాలన, పోలీస్ రాజ్యం నడుస్తోంది
- హరీష్ రావు ఆగ్రహం
- రైతుల పరామర్శలో అరెస్ట్
- ‘పోలీస్ రాజ్యం’ ఆరోపణ
- భూసేకరణపై డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, పూర్తిగా నిర్బంధ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న రైతులను ఓదార్చడానికి, వారికి భరోసా కల్పించడానికి వెళ్తుంటే అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా రైతులను కలవకుండా అడ్డుకోవడం గొంతు నొక్కే ప్రయత్నమని, ఇది రాష్ట్రంలో ఒక ‘పోలీస్ రాజ్యం’ నడుస్తోందనడానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.
Krithi Shetty: నా బ్రేకప్ మా అమ్మకు కూడా తెలుసు..ప్రస్తుతం సింగిల్నే!
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను హరీష్ రావు ‘గడీల పాలన, బేడీల పాలన’గా అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక నిర్బంధ వాతావరణం నెలకొందని, విమర్శించే వారిని అక్రమ అరెస్టులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకమైన ‘గుడ్డి పాలన’ ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా రెండు, మూడు పంటలు పండే పచ్చని సాగు భూములను ఫ్యాక్టరీల కోసం లాక్కోవడానికి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో సాగుకు పనికిరాని భూములు చాలా ఉన్నాయని, అభివృద్ధి పేరుతో పంట భూములను నాశనం చేయవద్దని సూచించారు.
DGP Shivadhar Reddy : తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసింది..
బాధిత రైతుల్లో మెజారిటీ ఎస్సీ, బీసీ , పేద వర్గాలకు చెందిన వారని, వారి ఏకైక జీవనాధారమైన భూములను లాక్కోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అరెస్టులు చేసినా రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని, ప్రజాస్వామ్యబద్ధంగా వారి హక్కుల కోసం పోరాడుతామని హరీష్ రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!