Harish Rao : కాంగ్రెస్ పర్యావరణ విధ్వంసానికి న్యాయవ్యవస్థ గట్టి బుద్ధి చెప్పింది
- సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కాంగ్రెస్కు చెంపపెట్టు
- పర్యావరణ విధ్వంసంపై సీఈసీ నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను వెలికి తీసింది
- ప్రజలంతా ఒక్కటై రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనను ఎదుర్కొవాలి : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణాన్ని ఎలా అణిచివేస్తుందో, అది ఎంత భయానకంగా, బాధ్యతారాహిత్యంగా సాగుతోందో ఇప్పుడు దేశానికి, ప్రపంచానికి తేటతెల్లమైందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో సుప్రీం కోర్టులో జరిగిన వాదనలు, ప్రభుత్వ నైపుణ్యానికి బదులుగా నిరంకుశత్వాన్ని ఉద్ఘాటించాయని ఆయన అన్నారు.
సెలవు దినాల్లోనూ ప్రభుత్వ యంత్రాంగం బుల్డోజర్లతో భూవిధ్వంసానికి పాల్పడడంపై సుప్రీంకోర్టు చేసిన గంభీర వ్యాఖ్యలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాంటి విషయమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. “బాధ్యత గల ప్రభుత్వం ఎలా ఉండాలో మరిచిపోయిన ఈ ప్రభుత్వానికి ఇది గుణపాఠంగా నిలుస్తుంది” అని ఆయన అన్నారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC) రూపొందించిన నివేదిక, ఈ భూములపై జరిగిన విధ్వంసానికి శాస్వత సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. వంద ఎకరాల అడవిని ధ్వంసం చేసిన ప్రభుత్వంపై, ఈ ప్రాంతాన్ని ఎలా పునరుద్ధరిస్తారో అడిగిన సుప్రీంకోర్టు ప్రశ్న ఆహ్వానించదగ్గ పరిణామం అని పేర్కొన్నారు.
“అధికారం ఉంది కదా అని ఎవరైనా తాము కోరినట్టు వ్యవహరిస్తే, న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోదు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కాపాడటానికి న్యాయవ్యవస్థ ఎప్పుడూ ముందుంటుంది. గతంలోనూ అనేకసార్లు ఇది నిరూపితమైంది. ఇప్పుడు మళ్లీ అదే తేలింది” అని హరీష్ రావు చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పర్యావరణ హత్యలకే ఉదాహరణగా మారిందని హరీష్ రావు మండిపడ్డారు. “నాడు హైడ్రా పేరుతో ఇళ్లను కూల్చి అరాచకం సృష్టించిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు బుల్డోజర్లతో అడవులను నాశనం చేయడంలో నిమగ్నమైందని విమర్శించారు. ప్రజల జీవనాన్ని పట్టించుకోకుండా పాలన సాగించే ఈ విధానం నిరంకుశ పాలనకు నిదర్శనం” అన్నారు.
“మేము న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం కలిగి ఉన్నాం. అందుకే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి నివేదిక ఇచ్చాం. అందులో ఆధారాలతో సహా పర్యావరణ విధ్వంసం వివరించాం” అని తెలిపారు. “వృక్షో రక్షతి రక్షిత – అని పెద్దలమాట. కానీ ఈ ప్రభుత్వం మాత్రం వృక్షో భక్షతి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలంతా ఒకటిగా ముందుకు రావాలి,” అని పిలుపునిచ్చారు హరీష్ రావు.
Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి భూములపై సీఈసీ కీలక నివేదిక.. పర్యావరణ పరిరక్షణకు మద్దతు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!