Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
- చర్చకు రాకుండా తప్పించుకున్నారని విమర్శ
- గురుకుల టెండర్లలో రూ.2,000 కోట్ల అవినీతి ఆరోపణ
- అప్పుల లెక్కలపై జూపల్లిపై ఎద్దేవా
- ప్రతిపక్షాల అరెస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చర్చలకు సవాల్ విసిరి, తీరా సమయం వచ్చేసరికి మంత్రులు పారిపోతున్నారని ఆయన మండిపడ్డారు.
చర్చకు రాకుండా పారిపోయిన జూపల్లి
తెలంగాణ భవన్కు వచ్చి చర్చకు కూర్చుంటానని ప్రగల్భాలు పలికిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆ తర్వాత మాట మార్చి చర్చకు రాకుండా తప్పించుకున్నారని హరీష్ రావు విమర్శించారు. తాము చర్చ కోసం తెలంగాణ భవన్లో అన్ని రకాల ఏర్పాట్లు చేసి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా, మంత్రి రాకుండా వెనుకడుగు వేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర అప్పుల విషయంలో జూపల్లి చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలని కొట్టిపారేశారు. నిన్నటివరకు రాష్ట్ర అప్పులు రూ. 8 లక్షల కోట్లు అన్న మంత్రి, నేడు రూ. 7 లక్షల కోట్లు అంటూ మాట మారుస్తున్నారని, ఆయనకు అంకెలపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు.
Also Read
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
గురుకులాల టెండర్లలో రూ. 2,000 కోట్ల భారీ అవినీతి
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు , గురుకుల పాఠశాలల టెండర్లలో దాదాపు రూ. 2,000 కోట్ల రూపాయల భారీ అవినీతి జరిగిందని హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ భారీ కుంభకోణంపై తాము నిలదీస్తున్నామని, వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతోనే ప్రభుత్వం వెనకాడుతోందని పేర్కొన్నారు.
పోలీసుల అండతో ప్రతిపక్షాల అరెస్టులు.. ప్రభుత్వ అసమర్థతకు అద్దం
గురుకులాల అవినీతి , రాష్ట్ర సమస్యలపై చర్చించడానికి, నిలదీయడానికి వెళ్లిన తమ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్ , తనను పోలీసులు అక్రమంగా అడ్డుకుని అరెస్ట్ చేయడంపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే చర్చకు సిద్ధమంటూ మొదట సవాలు విసిరే మంత్రులు, తీరా ప్రతిపక్షాలు నిలదీసేసరికి పోలీసులను ముందు పెట్టి అడ్డుకోవడం వారి అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. పోలీసుల వెనుక దాక్కుని పాలన సాగించడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి అద్దం పడుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్తో రోజంతా సాఫ్ట్గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!