US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- అమెరికాలో ఘోరం
- అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- రక్షించేలోపే ఊపిరాడక దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓహియో రాష్ట్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఖేడా జిల్లాకు చెందిన హితేష్భాయ్ సుతార్, ఆయన భార్య హీనాబెన్, 20 ఏళ్ల కుమార్తె ఇషానీగా గుర్తించారు. రెండేళ్ల క్రితం కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఓహియో రాష్ట్రంలోని వూస్టర్ నగరంలో ఉన్న ఎకానో లాడ్జ్ (Econo Lodge) మోటెల్లో హితేష్భాయ్ ఉద్యోగం చేస్తున్నారు. అదే మోటెల్లో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో మోటెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే మోటెల్ రిసెప్షన్కు ఫోన్ చేసి సహాయం కోరారు. బాత్రూమ్లో నీటి ట్యాప్లు తెరిచి అక్కడే ఉండాలని సిబ్బంది సూచించినట్లు సమాచారం. దీంతో హితేష్భాయ్, ఆయన భార్య, కుమార్తె బాత్రూమ్లోకి వెళ్లి తలుపు వేసుకుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.
Also Read
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
- India - Pakistan: భారత్ - పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
అయితే మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఎక్కువ సమయం పట్టడంతో బాత్రూమ్లోనే పొగతో ఊపిరాడక ముగ్గురూ మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అమెరికా అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక సమాచారం అందుకున్న బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తాజావార్తలు
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!