Harish Rao: మహిళలకు మరో కానుక.. వడ్డీ లేని రుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Gives Another Good News To Women: తెలంగాణ మంత్రి హరీశ్ రావు మహిళలకు మరో కానుక ప్రకటించారు. వడ్డీ లేని రూ.750 కోట్ల రుణాన్ని మహిళా దినోత్సవం రోజున విడుదల చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెర్ప్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని తెలిపారు. వీఓఏలకు కూడా త్వరలోనే శుభవార్త చెప్తామన్న ఆయన.. ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్లో ఉన్న ఇబ్బందులను త్వరలోనే తొలగిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. మహిళా దినోత్సవం రోజున 100 మహిళా ఆస్పత్రులను ప్రారంభిస్తామని, ప్రతి మంగళవారం మహిళ సమస్యల మీద మహిళా డాక్టర్లు వైద్యం చేస్తారని తెలియజేశారు.
Harish Rao : అక్క, చెల్లెళ్లందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
అంతకుముందు.. సంగారెడ్డిలో మహిళా సమాఖ్య భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్, అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కాచెల్లెలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల తల్లులకు కేసీఆర్ ఓ వరం అయ్యారన్నారు. కళ్యాణలక్ష్మితో పెళ్లికి ఆదుకున్నాడని, ఆరోగ్య లక్ష్మితో బిడ్డ కడుపులో ఉండగానే పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్తో డెలివరీ కాగానే కిట్ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. 1600 కాన్పులైతే, అందులో కేవలం 200 కాన్పులు మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రల్లో అయ్యాయన్నారు.
Minister KTR : ఆశా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే
శ్రీ రామనవమి నుంచి న్యూట్రిషన్ కిట్ ఇస్తామని, తల్లికి అవసరమైన పౌష్టికాహారాన్ని ఈ కిట్లో ఇస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు. 6 లక్షల మందికి ఈ కిట్ అందజేస్తామన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ హయాంలో తాగడానికి మంచి నీళ్లు దొరికేవి కావని, నీళ్ల కోసం బావుల దగ్గరికి వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఇంటి దగ్గరికే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని అన్నారు. 46 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు మహిళలకు చదువు చెప్పిస్తున్నారన్నారు. కరోనా వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ 10 కిలోల ఉచిత బియ్యం ఇచ్చారని, వృద్ధులను పెద్ద కొడుకులాగా కేసీఆర్ ఆదుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!