Harish Rao: మహిళలకు మరో కానుక.. వడ్డీ లేని రుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Gives Another Good News To Women: తెలంగాణ మంత్రి హరీశ్ రావు మహిళలకు మరో కానుక ప్రకటించారు. వడ్డీ లేని రూ.750 కోట్ల రుణాన్ని మహిళా దినోత్సవం రోజున విడుదల చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెర్ప్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని తెలిపారు. వీఓఏలకు కూడా త్వరలోనే శుభవార్త చెప్తామన్న ఆయన.. ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్లో ఉన్న ఇబ్బందులను త్వరలోనే తొలగిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. మహిళా దినోత్సవం రోజున 100 మహిళా ఆస్పత్రులను ప్రారంభిస్తామని, ప్రతి మంగళవారం మహిళ సమస్యల మీద మహిళా డాక్టర్లు వైద్యం చేస్తారని తెలియజేశారు.
Harish Rao : అక్క, చెల్లెళ్లందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
అంతకుముందు.. సంగారెడ్డిలో మహిళా సమాఖ్య భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్, అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కాచెల్లెలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల తల్లులకు కేసీఆర్ ఓ వరం అయ్యారన్నారు. కళ్యాణలక్ష్మితో పెళ్లికి ఆదుకున్నాడని, ఆరోగ్య లక్ష్మితో బిడ్డ కడుపులో ఉండగానే పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్తో డెలివరీ కాగానే కిట్ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. 1600 కాన్పులైతే, అందులో కేవలం 200 కాన్పులు మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రల్లో అయ్యాయన్నారు.
Minister KTR : ఆశా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే
శ్రీ రామనవమి నుంచి న్యూట్రిషన్ కిట్ ఇస్తామని, తల్లికి అవసరమైన పౌష్టికాహారాన్ని ఈ కిట్లో ఇస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు. 6 లక్షల మందికి ఈ కిట్ అందజేస్తామన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ హయాంలో తాగడానికి మంచి నీళ్లు దొరికేవి కావని, నీళ్ల కోసం బావుల దగ్గరికి వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఇంటి దగ్గరికే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని అన్నారు. 46 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు మహిళలకు చదువు చెప్పిస్తున్నారన్నారు. కరోనా వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ 10 కిలోల ఉచిత బియ్యం ఇచ్చారని, వృద్ధులను పెద్ద కొడుకులాగా కేసీఆర్ ఆదుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..