Minister Harish Rao: కిషన్ రెడ్డికి హరీశ్ రావు సవాల్.. ఎక్కడికైనా వస్తా, తేల్చుకుందామా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Challenges Kishan Reddy Over Central Govt Funds: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం ఇచ్చింది ఎంత? రాష్ట్రం కేంద్రానికి ఇచ్చింది ఎంత? అనే విషయంలో కిషన్ రెడ్డి సోయి ఉండి మాట్లాడతాడా? లేదా? అన్నది తెలియట్లేదని ఎద్దేవా చేశారు. నిధుల విషయం తేల్చుకునేందుకు.. కిషన్ రెడ్డితో చర్చల కోసం ఎక్కడికైనా వస్తానని ఛాలెంజ్ చేశారు. కేంద్రానికి తామే రూ. 30 వేల కోట్లు జీఎస్టీ ఇచ్చామని.. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది మాత్రం కేవలం రూ. 8 వేల కోట్లేనని చెప్పారు. కేంద్రం 42 శాతం నిధులు ఇచ్చామని చెప్తోందని.. కానీ ఇచ్చింది 29 శాతం మాత్రమేనని తెలిపారు. కొన్ని పథకాలను సైతం రద్దు చేసి.. వేల కోట్ల రాష్ట్ర వాటాను తగ్గించారన్నారు.
ఇక ఈడీ, ఐటీలు బీజేపీ విడిచిన బాణాలని.. ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో అవి ముందే వస్తాయని హరీశ్ రావు పేర్కొన్నారు. కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా, తమని ఎన్ని ఇబ్బంది పెట్టినా.. భయపడమని తేల్చి చెప్పారు. బండి సంజయ్ మాటలకైతే తలా, తోక లేదని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ.. నెలకు లక్ష కోట్లు అప్పు తెస్తోందన్నారు. గడిచిన ఆరు నెలల్లోనే రూ. 1 కోటి కోట్ల అప్పులు తెచ్చారన్నారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా సీఎం కేసీఆర్ వల్లే అయ్యిందని.. ఈనెల 7వ తేదీన జగిత్యాలకు సీఎం వస్తారని తెలిపారు. నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కొత్త కార్యాలయం, మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని హరీశ్ రావు తెలిపారు.
Also Read
అంతకుముందు.. తెలంగాణ రాష్ట్రంలో మాతృమరణాలు తగ్గాయన్న హరీశ్ రావు, డబుల్ ఇంజిన్ సర్కారున్న రాష్ట్రాలు మాత్రం వెనక బడ్డాయని అన్నారు. అతి తక్కువ ఎంఎంఆర్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందన్నారు. అలాగే.. ప్రజల కంటి సమస్యలు తొలగించేందుకు మరోసారి ‘కంటి వెలుగు) కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ సారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి, 55లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించిందన్నారు.
తాజావార్తలు
-
AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
-
Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
-
Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ట్రెండింగ్
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?