Minister Harish Rao: కిషన్ రెడ్డికి హరీశ్ రావు సవాల్.. ఎక్కడికైనా వస్తా, తేల్చుకుందామా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Challenges Kishan Reddy Over Central Govt Funds: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం ఇచ్చింది ఎంత? రాష్ట్రం కేంద్రానికి ఇచ్చింది ఎంత? అనే విషయంలో కిషన్ రెడ్డి సోయి ఉండి మాట్లాడతాడా? లేదా? అన్నది తెలియట్లేదని ఎద్దేవా చేశారు. నిధుల విషయం తేల్చుకునేందుకు.. కిషన్ రెడ్డితో చర్చల కోసం ఎక్కడికైనా వస్తానని ఛాలెంజ్ చేశారు. కేంద్రానికి తామే రూ. 30 వేల కోట్లు జీఎస్టీ ఇచ్చామని.. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది మాత్రం కేవలం రూ. 8 వేల కోట్లేనని చెప్పారు. కేంద్రం 42 శాతం నిధులు ఇచ్చామని చెప్తోందని.. కానీ ఇచ్చింది 29 శాతం మాత్రమేనని తెలిపారు. కొన్ని పథకాలను సైతం రద్దు చేసి.. వేల కోట్ల రాష్ట్ర వాటాను తగ్గించారన్నారు.
ఇక ఈడీ, ఐటీలు బీజేపీ విడిచిన బాణాలని.. ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో అవి ముందే వస్తాయని హరీశ్ రావు పేర్కొన్నారు. కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా, తమని ఎన్ని ఇబ్బంది పెట్టినా.. భయపడమని తేల్చి చెప్పారు. బండి సంజయ్ మాటలకైతే తలా, తోక లేదని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ.. నెలకు లక్ష కోట్లు అప్పు తెస్తోందన్నారు. గడిచిన ఆరు నెలల్లోనే రూ. 1 కోటి కోట్ల అప్పులు తెచ్చారన్నారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా సీఎం కేసీఆర్ వల్లే అయ్యిందని.. ఈనెల 7వ తేదీన జగిత్యాలకు సీఎం వస్తారని తెలిపారు. నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కొత్త కార్యాలయం, మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని హరీశ్ రావు తెలిపారు.
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
అంతకుముందు.. తెలంగాణ రాష్ట్రంలో మాతృమరణాలు తగ్గాయన్న హరీశ్ రావు, డబుల్ ఇంజిన్ సర్కారున్న రాష్ట్రాలు మాత్రం వెనక బడ్డాయని అన్నారు. అతి తక్కువ ఎంఎంఆర్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందన్నారు. అలాగే.. ప్రజల కంటి సమస్యలు తొలగించేందుకు మరోసారి ‘కంటి వెలుగు) కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ సారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి, 55లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించిందన్నారు.
తాజావార్తలు
-
Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం “అమ్మ”
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్