Minister Harish Rao: కిషన్ రెడ్డికి హరీశ్ రావు సవాల్.. ఎక్కడికైనా వస్తా, తేల్చుకుందామా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Challenges Kishan Reddy Over Central Govt Funds: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం ఇచ్చింది ఎంత? రాష్ట్రం కేంద్రానికి ఇచ్చింది ఎంత? అనే విషయంలో కిషన్ రెడ్డి సోయి ఉండి మాట్లాడతాడా? లేదా? అన్నది తెలియట్లేదని ఎద్దేవా చేశారు. నిధుల విషయం తేల్చుకునేందుకు.. కిషన్ రెడ్డితో చర్చల కోసం ఎక్కడికైనా వస్తానని ఛాలెంజ్ చేశారు. కేంద్రానికి తామే రూ. 30 వేల కోట్లు జీఎస్టీ ఇచ్చామని.. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది మాత్రం కేవలం రూ. 8 వేల కోట్లేనని చెప్పారు. కేంద్రం 42 శాతం నిధులు ఇచ్చామని చెప్తోందని.. కానీ ఇచ్చింది 29 శాతం మాత్రమేనని తెలిపారు. కొన్ని పథకాలను సైతం రద్దు చేసి.. వేల కోట్ల రాష్ట్ర వాటాను తగ్గించారన్నారు.
ఇక ఈడీ, ఐటీలు బీజేపీ విడిచిన బాణాలని.. ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో అవి ముందే వస్తాయని హరీశ్ రావు పేర్కొన్నారు. కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా, తమని ఎన్ని ఇబ్బంది పెట్టినా.. భయపడమని తేల్చి చెప్పారు. బండి సంజయ్ మాటలకైతే తలా, తోక లేదని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ.. నెలకు లక్ష కోట్లు అప్పు తెస్తోందన్నారు. గడిచిన ఆరు నెలల్లోనే రూ. 1 కోటి కోట్ల అప్పులు తెచ్చారన్నారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా సీఎం కేసీఆర్ వల్లే అయ్యిందని.. ఈనెల 7వ తేదీన జగిత్యాలకు సీఎం వస్తారని తెలిపారు. నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కొత్త కార్యాలయం, మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని హరీశ్ రావు తెలిపారు.
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
- CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
అంతకుముందు.. తెలంగాణ రాష్ట్రంలో మాతృమరణాలు తగ్గాయన్న హరీశ్ రావు, డబుల్ ఇంజిన్ సర్కారున్న రాష్ట్రాలు మాత్రం వెనక బడ్డాయని అన్నారు. అతి తక్కువ ఎంఎంఆర్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందన్నారు. అలాగే.. ప్రజల కంటి సమస్యలు తొలగించేందుకు మరోసారి ‘కంటి వెలుగు) కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ సారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి, 55లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించిందన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!