Harish Rao : 22A పేరుతో భూ దందా? హరీష్ రావు ఫైర్..
- బోడుప్పల్లో 1,500 కుటుంబాలకు 22A షాక్
- రేవంత్ సర్కార్పై హరీష్ రావు తీవ్ర ఆరోపణలు
- కమిషన్ల కోసమే వివాదాలంటూ మండిపాటు
- బాధితుల ఆస్తులు కాపాడుతామని బీఆర్ఎస్ హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోడుప్పల్ పరిధిలోని పలు కాలనీల ప్రజల భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, రేవంత్ రెడ్డి సర్కార్ను ’30 శాతం కమిషన్ ప్రభుత్వం’ అని ప్రజలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని ఆరోపించారు. నిషేధిత జాబితా పేరుతో ప్రజల ఆస్తులను కబ్జా చేసే హక్కు రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారని ఆయన నిలదీశారు.
దశాబ్దాల నివాసాలపై 22A నిబంధన.. కాలనీ వాసుల్లో ఆందోళన
బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీలకు చెందిన వందలాది మంది బాధితులు హరీష్ రావును కలిసి తమ ఆవేదనను పంచుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, సర్వే నంబర్ 215, 215 పార్ట్లలో గత 30 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా సుమారు 1,500 కుటుంబాలు ప్రశాంతంగా జీవిస్తున్నాయని తెలిపారు. అయితే, ఈ ఇళ్లను రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద 22A నిషేధిత జాబితాలో చేర్చడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అత్యవసర కష్టాల్లో ఇళ్లను అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లినప్పుడు ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలియడంతో ప్రజలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
- HYDRAA : మురుగు చెరువు నుంచి టూరిజం స్పాట్.. సున్నం చెరువు సరికొత్త లుక్.!
- Employee Fraud : క్రెడిట్ కార్డులతో కోటి మోసం.. మాజీ ఉద్యోగి బాగోతం..
- Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
కమీషన్ల కోసమే కృత్రిమ వివాదాలు.. బీఆర్ఎస్ పోరాట హెచ్చరిక
చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన ఆస్తులను అడ్డుపెట్టుకుని ప్రజలపై ఒత్తిడి తెచ్చి 30 శాతం కమీషన్లు దండుకునేందుకే ప్రభుత్వం ఇలాంటి కృత్రిమ వివాదాలు సృష్టిస్తోందని హరీష్ రావు విమర్శించారు. దశాబ్దాలుగా నివాసముంటున్న ప్రజలకు 22A భయం చూపిస్తూ, బినామీలతో సెటిల్మెంట్లు చేసుకునే దందాకు తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు. బోడుప్పల్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాధితులెవరూ అధైర్యపడవద్దని, ఈ వసూళ్ల సర్కార్ మెడలు వంచైనా బాధితుల ఆస్తులను కాపాడే బాధ్యతను బీఆర్ఎస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మాటలు పక్కనబెట్టి, తక్షణమే ఆయా కాలనీలను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని, లేకపోతే బాధితుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
-
Giorgia Meloni: 3% ఓట్ల పార్టీ నుంచి ప్రధాని వరకు.. జార్జియా మెలోని సరికొత్త రికార్డుకు చేరువ
-
Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
-
Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. ‘చిరు’ పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
-
Harish Rao : 22A పేరుతో భూ దందా? హరీష్ రావు ఫైర్..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?